Pandugalu and other stories Sri Pullaiah


                                            మంగళ హారతి 

                         జయమంగళం శుభమంగళం

                        నందనందనా నీకు మంగళం

                        జయమంగళం  శుభమంగళం

                       నందనందనా నీకు మంగళం

                                               యదుభూషణా  మృదుభాషణా 

                                                కమలేక్షణా  విమలాననా 

                                                లోకమోహనా  సుఖయోచనా

                                                సుఖకారణా  నీకు వందనం!!

                     నీవుపాడగా  నరులాడగా 

                     దయవేడ్కతో  జగమేలగా 

                     కనులారగా నినుజూడగా

                     జాలనైతిరా కృష్ణబాలకా 

                                        జయమంగళం శుభమంగళం 

                                       నందనందనా నీకు మంగళం

                                                                         Courtesy: Smt Nanduri Raja Rajeshwari Devi

 దసరా వచ్చేసింది కదండి.

నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట.

 దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే ఈ మన పాట ఆనాటివారికి గుర్తుకు రావలసినదే...

                   



ఇదే ఆ దసరా పాట

పల్లవి.                                   

                                       ఏదయా మీదయ మామీద లేదు!

                                       ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!

                                       దసరాకు వస్తిమని విసవిసల బడక!

                                       చేతిలో లేదనక  ఇవ్వలేమనక !

1..                      ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!

                         రేపురా మాపురా మళ్ళి రమ్మనక!

                         శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!

                         జయా  విజయీభవా దిగ్విజయీభవా!!

2.                                 పావలా బేడైతె పట్టేది లేదు!

                                    అర్థరూపాయైతె అంటేది లేదు!

                                   ముప్పావలైతేను ముట్టేది లేదు!

                                    రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!

                                   హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!

                                    జయా  విజయీభవా దిగ్విజయీభవా!!

                 3. అయ్యవారికి చాలు ఐదు వరహాలు!

                     పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!

                     మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!

                      శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!

                     జయా విజయీభవా దిగ్విజయీభవా!!

దసరా పండుగను గిలకల పండగంటారు చక్కగా కొత్త దుస్తులు ధరించి  వెదురుతో చేసిన విల్లం బులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ కొందరైతై పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది. పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుస ల్లో పాడుతూ ప్రతి వాకిటాఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైనఆచార మిది.

లోగుట్టు

ఒక వ్యక్తి అభివృద్ధి గాని కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు.వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు  బతక డానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు.

దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు.

పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు.

ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు విద్యార్ధులకు 

ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో. దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు. ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే. అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు.

ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది...               

                                                                      Courtesy : Pullaiah Soma        

🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒


మీరు ఈసారి హైదరాబాద్ లోని A. S. R. Nagar కు వెళితే......

బహుశా 2000 వ సంవత్సరం అనుకొంటా, ఒక ముసలాయన హైదరాబాద్ సిటీ బస్సులో టికెట్ కొనుక్కొంటూ కండక్టర్ తో  " A. S. R. నగర్ వస్తే చెప్పండి  " అన్నాడు. కాసేపయ్యాక బస్ ఆగితే ఆయన కండక్టర్ తో " ఇది ASR నగరేనా? " అని అడిగితే అపుడు కండక్టర్ విసుగ్గా " ఏమయ్యా, నీకు ASR నగర్ ఎక్కడుందో, ఎప్పుడొస్తుందో తెలియదా? " అన్నాడు. అపుడు పక్క సీట్లో వున్న మరో వ్యక్తి కండక్టర్ తో " ఆయనే A. S. R. గారు " అన్నపుడు  కండక్టర్ తో పాటు అది విన్న ఇతర ప్యాసెంజర్లు కూడా ఆశ్చర్యపోయారుట.అంత నిరాడంబరత A. S. Rao గారిది.

అయ్యగారి సాంబశివరావు గారికి 1960 లో పద్మశ్రీ, 1974లో పద్మభూషణ్ అవార్డులు వెతుక్కొంటూ వచ్చాయి.కానీ ఆయన కారు వాడేవాడు కాదు. 'ఎందుకండీ, ఇంకా చేతనౌతుంది, నడచి పోవచ్చు. చాలా దూరం అనుకోండి సిటీ బస్సులు వున్నాయి కదా! ' అనేవారు ఆయన.

ఎవరు ఈ A. S. Rao గారు?

1914 సెప్టెంబర్ 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లు గ్రామం లో జన్మించిన రావు గారికి elementary మరియు middle school లో చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఆయన తల్లి, ఆమె పెళ్లప్పుడు అమ్మ నాన్న లు పెట్టిన ఒక చీర ను పాత గుడ్డలు కొనుక్కొనేవారికి అమ్మి, ఆ డబ్బు ను రావు గారికి ఇచ్చిందట. ఎంతనో తెలుసా? 2 రూపాయలు  !

అప్పులు చేసి, పస్తులుండి చదువే ఆయుధంగా ముందుకు నడచి రావు గారు కాశీ లోని ప్రఖ్యాత Benaras Hindu University లో MSc physics చేరారు. హాస్టల్ సౌకర్యం దొరక్కపొతే, వాళ్ళను వీళ్ళను పావలా, అర్ధరూపాయ అడుక్కోంటూ 8 రూపాయలు అయితే దానితో రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసి MSc పూర్తీ చేసారు. అపుడు అమెరికా (క్యాలిఫోర్నియా ) లోని Stanford University లో Masters చేయాలని రావు గారి కోరిక. పేదరికం వెక్కిరించింది. కానీ ఆయన ప్రతిభ ఎవరినో ఆకర్షించింది. ఎవరు వారు?

TATA సంస్థ 

40 000 రూపాయలను ఆయనకు ఇచ్చి Stanford University కి పంపింది.

అక్కడ ఆయన మేధస్సుకు అమెరికన్ శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధకులు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, Masters తరువాత వాళ్ళు " ఇండియా వెళ్ళకండి. ఇక్కడే ప్రొఫెసర్ గా వుంటూ మా వాళ్ళను గైడ్ చేయండి, " అని ఆయనకు నెలకు పెద్ద జీతం ఆఫర్ చేసారు. ఎంతనో తెలుసా?

1, 50, 000 రూపాయలు.

కానీ రావు గారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, " క్షమించాలి. నేను నా మాతృదేశం ఋణం తీర్చుకోవాలి, నన్ను ఇక్కడికి పంపిన TATA సంస్థ కు నా సేవలు అందించాలి, " అన్నారట.

భారత్ తిరిగిచ్చాక టాటా వాళ్ళు Tata Institute of Fundamental Research (TIFR ) Mumbai లో ఉద్యోగం ఇచ్చారు. అపుడు ఆయన జీతం ఎంతనో తెలుసా?

300 రూపాయలు!

ఎక్కడ 1,50 000 ? ఎక్కడ 300 ?

ఈ కాలం లో అయితే ఆయన నిర్ణయాన్ని మనం పిచ్చి అంటాం. అవును మనకు డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, ప్రతిష్ట పిచ్చి, సుఖాల పిచ్చి !

ఆయనకు దేశమంటే పిచ్చి, కర్తవ్యం అంటే పిచ్చి, కృతఙ్ఞత అంటే పిచ్చి, నైతిక విలువలంటే పిచ్చి!

ముంబై లో రావు గారి పరిశోధనలు ఏ స్థాయిలో వుండేవంటే, సాక్షాత్తూ Father of Indian Nuclear Programme అని పిలవబడిన Dr. Homi Zahangir Bhabha తానే స్వయంగా ముంబై వెళ్లి రావు గారిని అభినందించి వచ్చారట.

తరువాతి రోజుల్లో ఆయన ఎన్నో విభాగాల్లో దేశానికి, సైన్స్ టెక్నాలజీ రంగాల్లో సేవలు అందించి, హైదరాబాద్ లో Electronics Corporation of India Ltd ( ECIL ) ను కూడా స్థాపించారు.

2003 లో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రి లో చేరినప్పుడు ఒక డాక్టర్ గారు ఆయనకు ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్ అమరుస్తూ వున్నారు. ఆయనకు తెలుసు రావు గారు ఇక కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతారని. అపుడు రావు గారు డాక్టర్ ను దగ్గరికి పిలిచి " నాకు ట్రీట్మెంట్ ఇచ్చి నీవు పైకి లేచేటప్పుడు జాగ్రత్త, పైన వున్న మానిటర్ నీ తలకు తగిలే ప్రమాదముంది " అని అన్నారట.

చివరి శ్వాస వరకూ ఇతరుల కష్టం, ఇతరుల బాధ తనవిగా భావించే సున్నితత్వం, మానవత్వం  వారిది.

ఇవే కదా ఒక మనిషి character ను నిర్ణయించేది !

ఈసారి హైదరాబాద్ లోని ASR నగర్ వెళితే ఆ మహనీయుడిని గుర్తు చేసుకోండి.

Take home message:

It’s difficult to lead a life as a simple man despite achieving any kind of glory!

                                 Courtesy: Dr. Muralidhar

* * * * * * * * * *  * * * * * * * * * * ** * ** * * * * *** * ** ** **** ****** ****** *******


ఉగాది (యుగాది) ఆచరణ విధానం🙏🌹

April 9 వ తేది (యుగ ఆది)

ఉగాది పర్వాచరణ విధానాన్ని ’పంచవిధుల సమన్వితం’గా ఇలా ఉన్నాయి తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం... మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో( బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

(5) పంచాంగ శ్రవణం

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది. ‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

    🌹🔱శ్రీ మాత్రే నమః 🔱🌹

🙏🙏🙏 🙏🕉️🙏 🙏🙏🙏


తెలుగు యుగాది సంll.ల పేర్లు ఎలా వచ్చాయి,వాటి అర్థాలు...

ఒక్కో తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ

తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారుచేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికీ కూడా మనం పిలుస్తున్నాము.

తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ ఏడాది దాని ప్రకారమే కొనసాగుతుంది. తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం 60 పేర్లు, వాటి అర్థాలు ఇవే.

తెలుగు ఉగాది 60 సంవత్సరాల పేర్లు:

1. ప్రభవ- యజ్ఞాలు అధికంగా జరుగుతాయి

2. విభవ- సుఖంగా జీవిస్తారు

3. శుక్ల- సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు

4. ప్రమోద్యుత- అందరికీ ఆనందాన్ని ఇస్తుంది

5. ప్రజోత్పత్తి- అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది

6 .అంగీరస- భోగాలు కలుగుతాయి

7 .శ్రీముఖ- వనరులు సమృద్ధిగా ఉంటాయి

8. భావ- ఉన్నత భావాలు కలిగి ఉంటారు

9. యువ- వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి

10. ధాత- అనారోగ్య బాధలు తగ్గుతాయి

11.ఈశ్వర- క్షేమం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది

12. బహుధాన్య- దేశం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని సూచిస్తుంది

13. ప్రమాది- వర్షాలు మధ్యస్థంగా ఉంటా  యి

14.విక్రమ- పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు

15. వృష- వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి

16. చిత్రభాను- అద్భుతమైన ఫలితాలు పొందుతారు

17. స్వభాను- క్షేమము, ఆరోగ్యం

18. తారణ- మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి

19. పార్థివ- ఐశ్వర్యం, సంపద పెరుగుతాయి

20. వ్యయ- అతివృష్టి, అనవసర ఖర్చులు

21. సర్వజిత్తు- సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి

22. సర్వదారి- సుభిక్షంగా ఉంటారు

23. విరోధి- వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం

24. వికృతి- ఈ సమయం భయంకరంగా ఉంటుంది

25. ఖర- పరిస్థితులు సాధారణంగా ఉంటాయి

26. నందన- ప్రజలకు ఆనందం కలుగుతుంది

27. విజయ- శత్రువులను జయిస్తారు

28. జయ- లాభాలు, విజయం సాధిస్తారు

29. మన్మధ- జ్వరాది బాధలు తొలగిపోతాయి

30. దుర్ముఖి- ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు

31.హేవళంబి- ప్రజలు సంతోషంగా ఉంటారు

32. విళంబి- సుభిక్షంగా ఉంటారు

33. వికారి- ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది, శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది

34. శార్వరి- పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది

35 .ఫ్లవ- నీరు సమృద్ధిగా ఉంటుంది

36. శుభకృత- శుభాలు కలిగిస్తుంది

37. శోభకృత్- లాభాలు ఇస్తుంది

38. క్రోధి- కోపం కలిగిస్తుంది

39. విశ్వావసు- ధనం సమృద్ధిగా ఉంటుంది

40. పరాభవ- ప్రజల పరాభవాలకు గురవుతారు

41 ఫ్లవంగ- నీరు సమృద్ధిగా ఉంటుంది

42. కీలక- పంటలు బాగా పండుతాయి

43. సౌమ్య- శుభ ఫలితాలు అధికం

44. సాధారణ- సాధారణ పరిస్థితులు ఉంటాయి

45.విరోధికృత్- ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది

46. పరీధావి- ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది

47. ప్రమాదీచ- ప్రమాదాలు ఎక్కువ

48. ఆనంద- ఆనందంగా ఉంటారు

49. రాక్షస- కఠిన హృదయం కలిగి ఉంటారు

50. నల- పంటలు బాగా పండుతాయి

51. పింగళ- సామాన్య ఫలితాలు కలుగుతాయి

52. కాళయుక్తి- కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి

53. సిద్ధార్థి- కార్య సిద్ధి

54. రౌద్రి- ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి

55. దుర్మతి- వర్షాలు సామాన్యంగా ఉంటాయి

56. దుందుభి- క్షేమం, ధ్యానం

57. రుధిరోద్గారి- ప్రమాదాలు ఎక్కువ

58. రక్తాక్షి- అశుభాలు కలుగుతాయి

59. క్రోధన- విజయాలు సిద్ధిస్తాయి

60. అక్షయ- తరగని సంపద

ఇలా మనకు తెలుగు ఉగాది సంవత్సర పేర్లు వచ్చాయి...🙏

###############################################################################

T. T. D  పూర్వ I . A. S. అధికారి  శ్రీ  P.V.R.K. ప్రసాద్  గారి  రచన.


తిరుమల కొండమీద వేంకటేశ్వరుని    ఆలయంలో                                                                                                                     ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది! 

శ్రీవారి ఆలయంపై వున్న ఆనంద నిలయం విమానాన్ని పాలిష్‍ చేయడం సహా అనేక మరమ్మత్తు పనులు చేపట్టాం. 

అకస్మాత్తుగా ఒక రోజు ఇంజనీర్ వచ్చి, ఖంగారు ఖంగారుగా చెప్పాడు.

"ధ్వజస్థంభం పుచ్చిపోయింది."

...  మెల్లగా బంగారు తొడుగులు తీస్తుంటే,  ఆ మాను క్రిందకంటా పుచ్చిపోయి ఉంది.

  మరి ఎలా నిలబడింది ? 

ధ్వజస్థంభంపై నున్న  బంగారు తొడుగులు ఆధారంగా మాత్రమే. ...

పుచ్చిపోయిన ధ్వజస్థంభంతో స్వామికి సేవలా? … అపచారం జరిగిపోతోంది.  

నాకు ఆందోళన ... ఆదుర్దా ... ఆరాటం ... భయం ... 

రికార్డుల ప్రకారం చూస్తే, పాత మాను ఎప్పుడు పెట్టారో ఆధారాలు లభించలేదు... 

మాకు లభ్యమైన గత 180-190 సంవత్సరాల రికార్డ్సులో ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు. అంటే ఇది ఎంతపాతదో? ఇప్పుడేమిటి చేయాలి? ... 

50-75 అడుగుల ఎత్తయిన టేకు మ్రానుని  సంపాదించి  ప్రతిష్టించాలి.  

ఆ మ్రానుకి తొర్రలు ఉండకూడదు. 

కొమ్మలు ఉండకూడదు. 

ఎలాంటి పగుళ్ళు వుండకూడదు.

దానికి వంపు ఉండకూడదు. నిటారుగా ఉండాలి. 

... నిస్పృహ వస్తోంది. ఇది జరిగేదేనా?  

అయినా ఆశ చావలేదు. క్షణాల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారుల్ని సంప్రదించాను. ‘‘ఇలాంటి లక్షణాలుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకడం అసాధ్యం’’ అని తేల్చారు. కర్నాటకలోగానీ, కేరళలోగానీ పడమటి కనుమల అడవుల్లో దొరకవచ్చు అని కూడా స్పష్టం చేశారు. 

... ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసింది.  ఈ లోపల ధ్వజస్థంభం క్రింద నిధి ఉందని మీడియా మిత్రుల ప్రచారం !! 

ఒక నిర్వేదం చుట్టుముట్టేసింది... దిక్కు తోచని ఆ స్థితిలో ఆ శ్రీనివాసుడే శరణ్యం అనుకున్నాను…

అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయల్దేర బోతుండగా, బెంగుళూరు నుంచి హెచ్‍. ఎస్‍. ఆర్‍. అయ్యంగార్‍ అనే భక్తుడు నాకోసం టెలిఫోన్‍ కాల్‍ చేశారు. అసహనంగానే ఆ ఫోన్‍ అందుకొని నేను మాట్లాడగానే, ఆయన ప్రవాహంలాగా చెప్పుకుంటూ పోతున్నాడు.... ‘‘అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియాలో విన్నాను. అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం 280-300 సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి. కర్నాటకలోని దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశంవుంది.... ఇక్కడి అటవీశాఖ ఛీఫ్‍ కన్సర్వేటర్‍ నాకు చాలా మిత్రుడు.... మీరు అనుమతిస్తే, నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా. మీరు లాంఛనప్రాయంగా ఒక లెటర్‍ ఆయనకి వ్రాయండి. మిగతా సమన్వయం బాధ్యత అంతా నాకు వదిలేయండి…..’’

అంతే, మరుక్షణం నేను అక్కడే ఆలయంలో కూర్చునే, కర్నాటక ఛీఫ్‍ సెక్రటరీతో, ఛీఫ్‍ కన్సర్వేటర్ తో  లాంఛనప్రాయంగా టెలిఫోన్‍లో మాట్లాడి, వాళ్ళ హామీ కూడా తీసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది....  

……..

బెంగుళూరులో అయ్యంగార్‍ ప్రోద్బలంతో ఛీఫ్‍ కన్సర్వేటరూ, వారి సిబ్బందీ గాలింపు జరిపి, ఒక వందచెట్లు పరీక్షించాక, దండేలి ప్రాంతంలోని కొండవాలుల్లో ఒక పదహారు టేకుచెట్లు వరకూ మాకు పనికి రావచ్చని తేల్చారు. సరిగ్గా అదే వారంలో కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు సకుటుంబంగా తిరుమలకు రావడం, నేను ఈ ధ్వజస్తంభం విషయం వారికి చెప్పడం, ఆయన వెంటనే ‘‘నూతన ధ్వజస్తంభం మానుని టిటిడికి కర్నాటక విరాళంగా తీసుకోండి’’ అని ప్రకటించడం జరిగిపోయాయి. 

ఆ వారాంతంలో నేను, మా ఇంజనీర్లతో కలిసి వెళ్ళి, అయ్యంగార్‍, ఛీఫ్‍ కన్సర్వేటర్‍ వెంటరాగా, ఆ 16 టేకు చెట్లు పరీక్షించాం. చివరకి వాటిల్లో మా కంటికి కనుపించినంతవరకు ఆరు చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా వున్నాయి. వాటిల్లో రెండు మా అవసరానికి మించిన ఎత్తులో వున్నాయి. నేను టిటిడి అవసరాలు దృష్టిలో వుంచుకొని, మొత్తం ఆరు చెట్లూ మాకే కావాలన్నాను.

అద్భుతం ! బెంగుళూరుకు తిరిగివచ్చి, ముఖ్యమంత్రిని, ఛీఫ్‍ సెక్రటరీని కలిసి మాట్లాడితే, ఆ ఆరు చెట్లూ విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే, చెట్లు నరకడం ఆరంభమైంది. కానీ అప్పుడే ఎదురైంది - మరో జటిలమైన సమస్య.... ఆ ఎత్తుపల్లాల అడవుల్లో కొన్ని కిలోమీటర్ల దూరం వస్తేగాని మెయిన్ రోడ్డు రాదు. అంతదూరం వాటిని మోసుకుంటూ తేవటం ఎలా ?

విచిత్రం! ఆ అడవిలో సోమానీ వారి పేపర్‍ మిల్లుకోసం కలప నరికే వాళ్ళకి తెలిసింది మా హడావుడి అంతా. ఆ మిల్లు యాజమాన్యం, సిబ్బందీ వచ్చేశారు. ‘‘అయ్యా! ఈ పని మాకు వదిలేయండి. ఇది శ్రీనివాసునికి మా సేవగా భావించండి’’ అంటూ ఆ కార్యభారం వాళ్ళు తలకెత్తుకున్నారు. ఇంక చెప్పేదేముంది. 

వారం రోజుల్లో చెట్లు నరకటం, వాటిని సోమానీ మిల్లు సిబ్బంది - తాళ్ళు, కప్పీలు, గొలుసులు వగయిరా సామగ్రి వుపయోగించి రోడ్డు మీదకు చేర్చటం పూర్తయిపోయింది. ఈ లోపల అయ్యంగార్‍ మళ్ళీ చొరవ తీసుకుని, ఒక 16 చక్రాలుండే పొడవాటి ట్రక్‍ని మాట్లాడాడు.

రెండురోజుల్లో ఆరుమానుల్నీ తీసుకుని ఆ ట్రక్‍ బెంగుళూరు వచ్చింది. అక్కడ విధానసౌధ దగ్గర చిన్న పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వాటిని టిటిడికి విరాళంగా ఇస్తున్నట్లు లాంఛనప్రాయంగా ప్రకటించి, నా చేతికి అప్పగించారు. వేలాది ప్రజల సమక్షంలో జరిగిన ఆ అప్పగింతలో ఆ మానుల్ని తాకగానే అనిర్వచనీయమైన ఆనందంతో నా ఒళ్ళు పులకించింది. (ఎందుకలా?)....... 

ఆ మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకే ట్రక్‍ తిరుపతి చేరుకుంది. వూరి బయట డెయిరీ ఫారం దగ్గర వేలాది స్త్రీ, పురుషులు గుమికూడారు. ఆ మానులు రాగానే హారతులిచ్చారు. ‘గోవిందా, గోవిందా’ అనుకుంటూ తన్మయత్వంతో నినాదాలు చేశారు. మరో గంటలో ఆ ట్రక్‍ ఘాట్‍ రోడ్డు మొదలుకి (అలిపిరి) చేరుకుంది. 

అక్కడిదాకా అంతా ఆనందమే. డ్రైవర్‍ ట్రక్‍ దిగాడు. కొండకేసి చూశాడు. ఘాట్‍రోడ్డు 18-19 కిలోమీటర్ల దూరం.... ఏడెనిమిది సంక్లిష్టమైన మలుపులు.... నా దగ్గరకు వచ్చాడు.

‘‘సర్‍, ఇది నా జీవితంలో ఒక గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్‍ ఆపకుండా కొండమీదకు నడపగలగాలి. అలా నడిపితేనే నాకు సంతృప్తి. మధ్యలో ఘాట్‍రోడ్డు పిట్టగోడలు దెబ్బతినొచ్చు.... ట్రెయిలర్‍ తగిలి బండరాళ్ళు దొర్లిపడొచ్చు.... ఎన్నిరోజులు పడుతుందో తెలీదు. ఏమైనా కానీ, నేను ఇది చేసి తీరాలి.....’’ 

నేను హామీ ఇచ్చాను - ‘‘బండలు విరిగిపడినా, పిట్టగోడ కూలిపోయినా, నీకు బాధ్యతలేదు. అదంతా మేం చూసుకుంటాం....’’ (అక్కడికేదో అంతా మేమే చేస్తున్నట్లు, మా శక్తితోనే అంతా నడిచిపోతున్నట్లు ఆత్మవిశ్వాసం. నిజమా?)

ఈ లోపల తిరుమలకి వెళ్లే  ట్రాఫిక్ ని కూడా (క్రిందకి దిగే) పాత ఘాట్ రోడ్డు మీదకి మళ్లించాము.  

మొత్తంమీద ఆ సంధ్యా సమయంలో అరుణ కాంతుల వెలుగులో ఆ టేకుమానులు భగవంతుని ముంగిట్లో ధ్వజస్తంభాలుగా మారటం కోసం ఆ ట్రక్‍మీద ఘాట్‍ రోడ్డులో ప్రయాణం సాగించాయి....

భయపడినట్లుగానే ట్రక్‍ మలుపుతిరిగినప్పుడల్లా కొన్నిచోట్ల ట్రెయిలర్‍ పైన మానులు కొండని కొట్టుకుని బండలు పడ్డాయి...

కొన్ని మలుపుల్లో లోయవైపున్న పిట్టగోడకూలిపోయింది....

మరికొన్ని మలుపుల్లో ట్రెయిలర్‍ వెనకాల ఒకవైపు చక్రాలు పిట్టగోడని గుద్దేసి, లోయ మీంచి దూకేశాయి....

వెనకాల కారులో వెళ్తున్న నాకూ, మా ఇంజనీర్లకీ ఈ ఫీట్లు చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. ఒకటి రెండు మలుపుల్లో సగం ట్రెయిలర్‍ లోయ అంచుమీంచి గెంతినట్లే అయింది.                            

‘‘ఆఁ ఆఁ..’’ అనుకుంటూ వెనకాల కార్లలో మేం ఆందోళనతో వూగిపోతున్నాం.

ఏ మలుపులో నయినా ట్రెయిలర్‍ క్రిందపడిపోతే.... ! ఇలాంటి ఆలోచనలు నాలో టెన్షన్‍ పెంచేస్తున్నాయి. క్షణాలు- నిముషాలు - గంటలు దొర్లిపోయాయి. "గోవిందా ... గోవిందా ..."

... గంటలు కాదు.   ఒక గంట దొర్లేలోపలే, అంటే 55 నిమిషాల్లోనే ఫీట్లు చేసుకుంటూ, మా సంభ్రమాశ్చర్యాలమధ్య ధ్వజస్తంభాల మానులతో ట్రక్‍ తిరుమలకి చేరిపోయింది. 

ఒక్కసారిగా వందలాది భక్తులు, టిటిడి ఉద్యోగులు ఆనందోత్సాహాలతో చేస్తున్న ‘‘గోవిందా-గోవిందా’’ పిలుపులతో తిరుమల గిరులు ప్రతిధ్వనించాయి.

నా కళ్లని నేనే నమ్మలేకపోతున్నాను.

నాలో ఆనందపు అలలు పొంగి ఆకాశాన్ని తాకుతున్నంత ఉద్వేగం కలిగింది. నాకు తెలీకుండానే నా కంట్లోంచి ఆనంద (భక్తి) బాష్పాలు రాలుతున్నాయి. ఆ ఆనంద రసానుభూతిలో కొన్ని క్షణాలపాటు చేష్టలుడిగి అలా వుండిపోయాను!!

ఏమిటా అద్భుతం! సూర్యాస్తమయం ఆరంభమయ్యే సమయంలో అలిపిరిలో బయల్దేరిన ట్రక్‍, సూర్యుడు పశ్చిమాద్రిన పూర్తిగా అస్తమించే సమయానికి కొండకి చేరిపోయింది. ఇంకా విచిత్రం, ట్రక్‍ యజమాని మా వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ అన్నాడు - ‘‘స్వామి వారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం. అందుకే నేను ఒక్క నయాపైసా కూడ రవాణా ఛార్జీలు తీసుకోవటం లేదు’’. (అతనికా ప్రేరణ ఎక్కడ్నుంచి కలిగింది?) 

- అయ్యంగార్‍ ని, ట్రక్‍ యజమానిని, డ్రైవర్‍ ని వేదపండితుల ఆశీర్వచనాలమధ్య, ప్రత్యేక దర్శనంతో, శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించాం. 

మరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎలా? ఎలా? - అలా రోజంతా నేనూ, మా ఇంజనీర్లు, అధికారులూ తలలు బద్ద్లయ్యేలా అర్ధరాత్రిదాకా చర్చలు జరిపి, ఇక జరిపే శక్తిలేక మర్నాటికి వాయిదా వేసుకుని వెళ్లిపోయాం. నాకు ఒక పట్టాన నిద్ర రాలేదు. మూడు వారాల పాటు అష్టకష్టాలు పడి టేకు మానులు తీసువచ్చాక, వాటి ప్రతిష్ఠ ఎలా చేయాలీ అన్నదానిమీద ఇంత తర్జనభర్జన ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఇంజనీర్లు, మేధావులం కలిసి కూడా ఈ చిన్నపని చేయలేకపోతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం... ? 

అలా ఆలోచిస్తుంటే, అప్పుడే మళ్లీ స్ఫురించింది - ‘‘ఏ శక్తి ఇంతపని చేయించిందో, ఆ శక్తి మిగతా పనికూడా చేయించదా?... ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రాప్తం నాకుంటే నా చేతుల మీదుగా జరుగుతుంది. లేకపోతే లేదు..’’ 

ఈ ఆలోచన రాగానే మనసు కుదుటపడింది. ప్రశాంతంగా నిద్రపోయాను. 

అందుకు భిన్నంగా జరగలేదు. ఉదయం చర్చల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎవరో అన్నారు - ‘‘ఎందుకండీ ఇదంతా, మానుని మహద్వారంలోంచి మోసుకువచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకి లేపి వుంచుతూ, మొదలు భాగం నేలమీదకే వుంచుతూ, ఏతాం ఆకారంలో తీసుకువద్దాం. అది సరిగ్గా మంటపం క్రిందకు వచ్చేసరికి, దాన్ని ఆ రంధ్రంలోంచి పైకి దోపుదాం. మన పాపనాశనం డామ్‍ కడుతున్న ఇంజనీరింగ్‍ సిబ్బంది, అక్కడి కళాసీల సహాయం తీసుకుందాం..’’- 

బ్రహ్మాండమైన ఆలోచన. (ఎక్కడిదీ ప్రేరణ?) ఆగమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి, మహద్వారంలోపల్నుంచి బలిపీఠం వరకు నేలని లోతుగా తవ్వుకుంటూ వెళితే, ఈ ప్లానుని అమలు చేయటం సాధ్యమవుతుందని తేల్చారు. పైగా మహద్వారానికీ, బలిపీఠంకీ మధ్య ఎంత తవ్వినా, ఏం చేసినా యాత్రికుల వరుసలకి  ఏమాత్రం అవరోధం వుండదనికూడా స్పష్టం చేశారు. 

ఇంక ఆలస్యం చేయలేదు. ముహూర్తం చూసి, హెచ్‍సిఎల్‍ ఇంజనీరింగ్‍ సిబ్బంది, కళాసీల సాయంతో ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకు మానుని సన్నిధి వీధిలోంచి, గొల్లమండపంలోంచి, మహద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టాం. అక్కడ్నుంచి మానుశిఖర భాగం మంటపం పై కప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వే బాదులతో స్టాండ్‍లు ఏర్పాటు చేశారు. మెల్లగా కళాసీలు మానుని ముందుకు తోస్తుంటే, అది అలా అలా లేచి సరిగ్గా మంటపం పై కప్పులో రంధ్రాన్ని క్రిందనుంచి చేరుకుంది. మహద్వారం దగ్గర్నుంచి బలిపీఠం దాకా నేలమీద గోతిలో మాను మొదలుని ముందుకు తోసుకు వెళ్తుంటే, ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి, ఆ మాను శిఖరం మంటపం పైన రంధ్రం లోంచి పైకి, ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మంటపం ఏ మాత్రం దెబ్బతినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలీ అడవుల్లోని టేకుచెట్టు తిరుమలేశుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్ఠకు సిద్ధంగా నిలబడింది. 

అద్భుతం ! … ఏమా శ్రీనివాసుడి కరుణ….. ?

అప్పుడే ఓ చిన్న కొసమెరుపు !  

ధ్వజస్తంభం క్రింద శాస్త్రానుసారంగా నవరత్నాలు, నవ ధాన్యాలు వగైరా వుంచాలన్నారు. అవి రెండు పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం క్రింద పునాది భాగంలో పెట్టాం. అకస్మాత్తుగా నాకు ఏదో తోచింది. వెంటనే నా మెడలో శ్రీనివాసుని డాలర్‍తో వున్న గోల్డ్ చైన్‍ తీసి ఒక పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరివున్న అర్చకులు, మిరాసీదార్లు, విఐపిలు, ఇతర భక్తులు కూడా ముందుకు వచ్చారు - శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తి పూర్వక బహుమానం ఇవ్వటానికి. అంతే! ఉంగరాలు, చైన్‍లు వగయిరా ఆభరణాలతో మరో పెట్టె నిండిపోయింది. అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి, వాటిపై కాంక్రీట్‍ పోశాక, దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం. (పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డామ్‍లో వేదోక్తంగా విశ్రమింపజేశాం) ఒక నెల రోజులకి నూతన ధ్వజస్తంభానికి ప్లాట్‍ఫారమ్‍ నిర్మాణం, పైన బంగారు ప్లేట్లు తొడగటం, శిఖర భాగాన పతాకాన్ని నిలబెట్టడం, ధ్వజస్తంభానికిముందు బలిపీఠం నిర్మించడం పూర్తయ్యాయి. 

ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి (మిగతా అన్ని మరమ్మతులు, బంగారు ప్లేట్లకు మెరుగు పెట్టడాలు వగయిరా అన్నీ పూర్తిచేశాక), ఆ బ్రహ్మోత్సవంలో భాగంగా ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య, వేద మంత్రోచ్చారణలతో తిరుమల గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్‍ 10న ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు. 

ఇది జరిగిన ఆరో రోజున (జూన్‍ 16న) నేను మరొకరికి పదవీబాధ్యతలు అప్పగించి, బదిలీ అయి వెళ్లిపోయాను. 

ఆ ఉదయం అలా బదిలీ అయి వెళ్లిపోతూ, దండకారణ్యం నుంచి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకు చెట్టు (ఇప్పుడది ధ్వజస్తంభం) కేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వడులు చేస్తూ వూగుతున్నాయి. ఏదో వింత అనుభూతి ...! 

అక్కడే వున్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి, ఒక శ్లోకం చదివారు : 

‘‘నాహం కర్తా హరిః కర్తా

తత్పూజా కర్మ చాఖిలం

తదాపి మత్కృతా పూజా

తత్ప్రసాదేన నా అన్యథా’’

“నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు.”

(Source: పూర్వ ఐఏఎస్ అధికారి  పివిఆర్ కె ప్రసాద్ రచన  'నాహం కర్తా, హరిః కర్తా')

 ------- -———— ————- ————- 

This happened on June 10, 1982 i.e 42 years ago.

**********************************************************************************

॥ గుర్వాష్టకం ॥


శరీరం సురూపం తథా వా కళత్రం

యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ ।

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ ౧ ॥


కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం

గృహం బాంధవాః సర్వమేతద్ధి జాతమ్ ।

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ ౨ ॥


షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా

కవిత్వాది గద్యం సుపద్యం కరోతి ।

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ ౩ ॥


విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః

సదాచారవృత్తేషు మత్తో న చాన్యః ।

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ ౪ ॥


క్షమామండలే భూపభూపాలబృందైః

సదా సేవితం యస్య పాదారవిందమ్ ।

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ ౫ ॥


యశో మే గతం దిక్షు దానప్రతాపా-

జ్జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్ ।

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ ౬ ॥


న భోగే న యోగే న వా వాజిరాజౌ

న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్ ।

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ ౭ ॥


అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే

న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే ।

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే

తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥ ౮ ॥


గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ

యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ ।

లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మసంజ్ఞం

గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నమ్ ॥

ఇతి శ్రీమద్ శంకరాచార్య విరచితం

గానం:కులదీప్ పాయి  & సూర్యగాయిత్రి


సంగీతం: కులదీప్ పాయి

***********************************************************************************

భక్తి   కధలు-1

ఒక వృద్ధ స్త్రీ - బృహదీశ్వరాలయం - అజ్ఞాత ఘటన

ప్రాచుర్యంలో లేని ఒక కథ – తంజావూర్ బృహదీశ్వరాలయం దర్శించిన ఒక వృద్ధ స్త్రీ

భరతవర్షము యొక్క సుదీర్ఘ నాగరిక చరిత్రలో అతి దారుణముగా నిరాదరణకు గురైన ఒక అసమానము, అవిచ్ఛిన్నము గా సాగి పురోగామిగా వున్నచరిత్ర - రెండువేల సంవత్సరాల నౌకావాణిజ్య చరిత్ర. రోమునుంచి వచ్చిన బంగారం భారతవర్షం అంతటా వ్యాపించినా ఐశ్వర్యముతో తులతూగుతున్న శాతవాహనుల సామ్రాజ్యంలో మరీ విస్తృతంగా వ్యాప్తి చెందింది.

నాణ్యమైన భారతీయ పట్టు వస్త్రాలను , అద్దకపు రంగులను , శ్రేష్టమైన సుగంధ ద్రవ్యాలను రత్నాలను మణులను రోమను సామ్రాజ్యం బంగారం వినిమయం ద్వారా కొనుగోలు చేసేది.

భారత నౌకావాణిజ్య చరిత్రలో మరో విశిష్ట అధ్యాయం ఇంచుమించు ఘన చరిత్ర గల గుప్తులతో ప్రారంభం అవుతుంది. నేటి వరకు నిలదొక్కుకొని నిలిచిన సనాతన నాగరికత, సంస్కృతుల సకల వైభవ విశేషాలకు విస్తృతమైనపునాదులు నిర్మించిన వారు వారే.

ఉత్తరభారతం అరబ్బు , తురుష్క ముష్కరుల పాలైన అనంతరం దక్షిణ భారతంలో మరొక శకం ఆరంభమైంది. శకలమైన చోళ సామ్రాజ్యాన్ని ఏకీకృతం చేసిన ఒకటవ రాజరాజు సముద్రవాణిజ్య వ్యవహారాలలో తన దక్షతను చూపించడం ద్వారా సంపద వినిమయము పెరిగింది , సంపద వృద్ధి కూడా జరిగింది. సింధు మహాసాగరం మొదలుకొని తూర్పున బంగాళాఖాతం కోస్తా ప్రాంతమంతా కళింగదేశం వరకు ఈయన ఆధిపత్యం కొనసాగింది. ఇదంతా కేవలం ఇరవైతొమ్మిది సంవత్సరాలలోనే జరిగింది.

ఈ ఇరవైతొమ్మిది సంవత్సరాలలో రాజరాజు ధర్మ ప్రభువు గా కూడా ప్రసిద్ధి చెందాడు.తన వైవిధ్యభరితమైన విజయాలతో సనాతన సమ్రాట్టులలో, ఒక హిమోన్నత శిఖరంగా పరిగణన పొందాడు. తన పరిపాలనలో అమలులోకి తెచ్చిన సమూలమైన వ్యవస్థా గత సంస్కరణలు ఆయన సునిశిత మేధా సంపత్తికి తార్కాణాలు. విశాలమైన తన సామ్రాజ్యాన్ని ‘ వలనాడు’ లనే పరిపాలక విభాగాలుగా వ్యవస్థీకరించి ప్రతిగ్రామానికి అత్యధికమైన స్వయం ప్రతిపత్తిని ప్రసాదించాడు. ఆ నాటి గ్రామ వైభవపు ఆనవాళ్ళు దాదాపు అంతరించినా, తక్కువలో తక్కువైనా నేటికీ తమిళనాడు రాష్ట్రంలో మిగిలి ఉన్నాయి.

రాజరాజ చోళుడు - సనాతనధర్మ ప్రభువు

రాజరాజ చోళుడు సనాతన ధర్మావలంబి అయిన ప్రభువు. ప్రపంచంలో ఆయనను ఎన్నో బిరుదులు వరించినప్పటికీ అనగా - రాజకేసరి , ముమ్ముడి చోళ [ చోళ , పాండ్య, చేర కిరీటధారి], రాజరాజ చోళ అని గౌరవించినప్పటికీ, శివపాదములందు శిరసుంచిన ‘ శివపాద శేఖరుని’ గా తనను తాను భావించుకొనేవాడు. ఆయన విశిష్ట శివ భక్తుడు కావటమే కాదు, ఆయన లేకపోతే నేడు మనకు తెలిసిన నాయనార్ల విశేషాలు పూర్తిగా అంతరించి పోయి ఉండేవి. ఆయనకున్న కలికితురాయి వంటి బిరుదు , తిరుమురై కండ చోళన్ [ శివస్తుతుల సంకలనమైన ‘తిరుమురై’ దర్శించి లోకానికి ప్రసాదించిన చోళుడు] ఆయనకు పవిత్రమైన ఆభరణము వంటిది. నూరు సంవత్సరాల క్రూర ద్రవిడ ఉద్యమాలు , క్రైస్తవ మిషనరీల దురాగాతాలున్నప్పటికీ అటువంటి సమ్రాట్టులు, సాధు సంతులు, కవులు, సన్న్యాసులు, వీధిభాగవతులు - వలననే నేటికీ సనాతన సంస్కృతి సంప్రదాయాలు సజీవంగా ఉండి తమిళనాడులో రక్షించబడ్డాయి.

రాజరాజ చోళుని శివభక్తిని శిఖరాగ్రస్థాయి తార్కాణమే తన రాజధాని తంజావూరులో అతడు నిర్మింపజేసిన బృహదీశ్వరాలయం. ఈశ్వర భక్తిని మలచగా అది బృహదీశ్వరాలయమైనది అనవచ్చు. ఒక వీక్షణంలోనే ఆ ఆధ్యాత్మిక నిర్మాణం మనలోని అంతరాంతరాలలోని మహనీయ చైతన్యాన్ని జాగృతం చేస్తుంది. ఇప్పటికి కాలక్రమంలో ఆ ఆలయం వయస్సు 1010 సంవత్సరాలు కావచ్చు, కాని దైవ సంకల్పం తో కూడిన ఈ ఘటన ఆ ఆలయ దైవత్వాన్ని చాటేందుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

దైవ ఘటన

బృహదీశ్వరాలయం నిర్మాణం పూర్తయింది. ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలలో , ఒకటే మిగిలి పోయింది. పూజ ఆరంభం చెయ్యడానికి ముందుగా ఆలయ ఘంటానాదం చెయ్యవలసి ఉన్నది. అతి పెద్ద ఆలయానికి అతి పెద్ద ఘంట. ఘంటకు కట్టిన త్రాడును ఎవరు లాగినా గంట మ్రోగడం లేదు. సాయంకాలం కావస్తున్నది. భక్తితో అక్కడి వారందరూ చేసిన ప్రార్థనల ఫలితముగా అక్కడే ఉన్న ఒక భక్తుని ద్వారా ఈశ్వరుని సందేశం వచ్చింది. ఆలయనిర్మాణం కోసం కృషి చేసిన నిజమైన భక్తుడు గంటలాగితేమాత్రమే మ్రోగుతుంది అనే వార్త వినబడింది

సహజంగానే రాజారాజ చోళ మహరాజునే గంట లాగి మ్రోగించమని కోరారు. ఆయన లాగి చూశాడు ఏమీ కదలిక లేదు. ప్రధానార్చకుల వారు లాగి ప్రయత్నం చేశారు , ఊహుఁ, ఏ ప్రయోజనము లేదు. అన్ని రకాల భక్తులు, సంతులు, సాధువులు , సన్న్యాసులు, దాతలు, శిల్పులు, పనివాళ్ళు, ఎందరెందరో ప్రయత్నాలు చేశారు. ఫలితం శూన్యం.

సాయకాలం కరిగిపోయి రాత్రిలో లీనమయ్యింది. ప్రజల్లో భయం ఆవరించింది. ఎక్కడో మహాపరాధం జరిగింది. మహా మంగళ హారతి ఇవ్వాల్సిన సమయం దగ్గరపడుతున్నది. మహా మంగళ హారతి అయితేనే ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రసాద వితరణ తర్వాతనే అన్నదానం, అనగా రాత్రి భోజనం, జరగాలి. ఇవన్నీ కూడా గంట మ్రోగిన తర్వాతజరగాల్సినవే. ఆ సమయంలో ఊహించని సంఘటన - ఒక వృద్ధ స్త్రీ మహాద్వారానికి తల ఆనించి, నమస్కరించి గంట కున్న త్రాడును లాగింది , ఆశ్చర్యం - బృహదీశ్వరాలయ ప్రాంగణం అంతా సుశ్రావ్యమైన బృహద్ఘంటానాదంతో మార్మ్రోగిపోయింది.

విశాలమైన ఆలయ ప్రాంగణమంతా నిండి ఉన్న భక్త జనులు చేష్టలుడిగి మ్రాన్పడి నిలుచున్నారు. వాళ్ళందరిలో మనసులో మెదిలి వ్యక్తంకాని ఒకే ప్రశ్న , ఎవరీ స్త్రీ ? ఇదివరకు ఎప్పుడూ చూసినట్లే లేదు. ఒకవేళ చూసిఉన్నా గుర్తుపెట్టుకోదగిన లక్షణాలేవీ లేవు. ఎవరో ఒక దారిన పోయే దానమ్మ, అంతే పల్లెటూరి ముఖం. ఒక బీద రైతు భార్య కావచ్చునేమో. లేదా పూట గడవడానికి కూలి-నాలి చేసుకొనే మనిషేమో? ఎవరికీ అంతుపట్టటం లేదు. బృహదీశ్వరుడు, అనంత శక్తివంతుడైన ఈ మహాదేవుడు ఈ ఆలయ నిర్మాణానికి నిజమైన కృషి సల్పిన వ్యక్తిగా ఈమెను గుర్తించాడు.

వేరే చెప్పాల్సిన పనిలేదు, అందరి కళ్ళు ఆమెనే చూస్తున్నాయి. రాజరాజ చోళ మహారాజు ఆమె వద్దకు వెళ్లి భక్తితో నమస్కరించాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆమె ఏవిధంగా ఆలయ నిర్మాణానికి తోడ్పడిందో తెలుసుకోవాలనే ఉత్కంఠతో ఉన్నారు, తెలుసుకొని భవిష్యత్తులో వారు ఆచరించవచ్చు కదా అని ఆశతో ఉన్నారు.

అమాయకురాలైన ఆ ఆడమనిషి ఉన్నట్టుండి ఇంతమంది ప్రజలు ఆశ్చర్యచకితులై చూడడంతో భయభ్రాంతురాలైంది. మామూలు అందరు భక్తులవలెనే తన ప్రయత్నం చేసింది, రోజంతా జరిగిన విషయం ఆమెకు తెలియనే తెలియదు. అమ్మా మీరెక్కడ ఉంటారు , ఏమి చేస్తూవుంటారు, మీ జీవన విశేషాలేమిటి అని అనేక ఆరాలు తీశారు,ఆమె ఇచ్చిన సమాధానాలు ఆమె సాధించినఅలౌకిక విశేషానికి పొంతన లేకుండా ఉన్నాయి.

బృహదీశ్వరాలయ శిఖరం 25 టన్నుల బరువుండి, 80 టన్నుల బరువున్న భారీ నల్లరాయి పైన నిలబడి ఉన్నది. 45 ఎకరాల్లో విస్తృతంగా వ్యాపించిన ఆలయ సముదాయ నిర్మాణంలో ఇది ఆవగింజ మాత్రమే అనుకున్నా , ఆలయం ప్రమాణము, పరిమాణము , విస్తీర్ణము మనకు ఆ బృహన్నిర్మాణము యొక్క భావనను కలుగజేస్తుంది. అదే ఒక చిన్న గ్రామంతో సమానం. ఆ కాలానికి సుదూరంగా ఉన్న మనకు, యాంత్రిక సౌకర్యాలు లేని కాలంలో అంతటి బృహదాలయాన్ని నిర్మించారనే విషయం మన ఊహకందని విషయం…...అసంఖ్యాకమైన గండరాళ్ళు ఎంతెంతో దూరాలనుంచి తరలించి, తీరుగా నిర్దుష్టతతో మలచి తేడాలు లేకుండా కలిపి నిర్మాణం చేసిన విధానం అద్వితీయం … ఎంతటి నాణ్యతతో చేసిన నిర్మాణమో, కాబట్టే వెయ్యి సంవత్సరాలు దాటినా స్థిరత్వాన్ని కోల్పోలేదు. ఆలయ నిర్మాణానికి పదునైదు సంవత్సరాలు పట్టింది.

కొంత బుర్రలు బద్దలు కొట్టుకొని , లోతుగా ఆరా తీసిన తరువాత ఆ అలౌకిక ఘటనకు సమాధానం లభించింది.

ఆమె సామాన్య కుటుంబానికి చెందిన అతి సాధారణ మహిళ. ఆమె నిజంగా బృహదీశ్వర ఆలయం నిర్మాణం ఆమె యే చేసిందనడం ఆమె జీవితమంత సాధారణ విషయం. పదునైదు సంవత్సరాలపాటు అక్కడే నీళ్ళు తొట్టినిండా నింపుకొని రహదారి వద్ద తీక్ష్ణమైన మధ్యాహ్నపు టెండలో నిలుచుని ఉండేది.ఆలయ నిర్మాణానికి కొండల్లాంటి శిలలను చేరవేసే ఎద్దులబండి వాళ్ళు తప్పనిసరిగా ఆగి ఎద్దులను విడిచేవాళ్ళు. ఆ ఎద్దులన్నీ దాహం తీర్చుకొనేంతవరకూ ఆ తొట్టిలో నీళ్ళు తెచ్చి పోస్తూనే ఉండేది. ఎద్దులన్నీ దాహం తీర్చుకొని కొంత విశ్రాంతి తీసుకొని బయలుదేరేవి. బృహదీశ్వర ఆలయం నిర్మాణంలోభాగస్వాములైనమూగజీవులకు ఆమె చేసిన ఉపకారానికి, స్వామి వారు ఆ గుర్తింపు కలగజేసి మొదటి ఘంటానాదం ఆమె చేతులమీదుగా జరిపించాడు.

చివరి వ్రాత

ఇటువంటి అసంఖ్యాకమైన కథనాల్లో దీనిని కల్పనగానూ , ప్రాంతీయ గాధగానూ త్రోసిరాజనవచ్చు. ఎందుచేతనంటే సమకాలీన బౌద్ధిక స్థితి ఇటువంటి ఘటనలపై తిరస్కారభావనలతో కూడిన ఎడారిగా మారింది, అక్కడ శాశ్వత విలువలు మొలవవు. కాని గమనించండి, మనం ఏకంగా బుద్ధినే కృత్రిమ మేధతో మార్పిడిని ఉన్మాదోత్సాహంతో అనుసరించే యుగంలో జీవిస్తున్నాము. చివరిగా మనలోని ఆధ్యాత్మిక ఔన్నత్యము చేజేతులా నిర్మూలించబడడమే పర్యవసానమేమో.

(ఎన్నో సంవత్సరాల క్రితం ఈ గాధను వినిపించిన శతావధాని డాక్టర్ గణేష్ గారికి ఎంతో ఋణపడి ఉన్నాను.)(Sandeep BalakrishnaTranslator: రామేశ్వరం జి)

🌸🌸🕉️🔥🕉️🌸🕉️🔥🕉️🌸🕉️🔥🕉️🌸🌸

***********************************************************************************

పై ఫోటో ఒకసారి చూడండి..

ఆరోజు చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నుండి వెళ్ళిపోయింది. తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విషయం తెలియక ఒక వృద్ధురాలు రైలు కొరకు ఎదురుచూస్తూ ప్లాట్‌ఫారమ్ పై  కూర్చొని ఉంది. అది గమనించిన ఒక కూలీ ఆ తల్లిని అడిగాడు. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అని. దానికి సమాధానం గా ఆ పెద్దావిడ నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పింది. జవాబుగా కూలీ ఈ రోజు ఇక రైలు లేదు అమ్మా అని చెప్పాడు. అందుకు ఆ స్త్రీ నిస్సహాయంగా చూసింది. అయితే ఆమెకు వెయిటింగ్ రూమ్‌లో ఆశ్రయం కల్పించాడు. అంతటితో ఆగకుండా ఆ కూలీ ఆమె కొడుకు గురించి అడగగా ఆమె తన కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడని తల్లి బదులిచ్చింది. పేరు చెప్పండి, సంప్రదించడానికి మేము ప్రయత్నిస్తాము అన్నాడు ఆ కూలి. మా అబ్బాయిని అందరూ లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు అని ఆ అమ్మ బదులిచ్చారు. ఆ స్త్రీ మూర్తి కొడుకు అప్పుడు ఇండియన్ రైల్వేస్ కేంద్ర కేబినెట్ మినిస్టర్. ఒక్క క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది. వెంటనే సైరన్న్ కారు వచ్చింది. వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. ఈ విషయం లాల్ బహదూర్ శాస్త్రికి ఏమీ తెలియకుండా భారతీయ రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది. ఆవిడ ఢిల్లీ లో తన కొడుకుని కలిసిన తర్వాత కొడుకుని ఈవిధంగా అడిగింది - "అబ్బాయి, నీవు రేల్వే లో ఏం పని చేస్తావు..."  

"ఆయన అన్నారు .. 

పెద్దగా చెప్పుకోదగ్గ పని కదులెమ్మా అని.."

ఇంత సత్వికతతో వున్నారు కాబట్టే ...

ఒక రైలు ఆక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు తన బాధ్యతగా భావించి రాజీనామా చేశారు.

ఆ తరం ఈ తరానికి ..

ఖచ్చితంగా ఆదర్శం 🙏🏻

Comments

Popular posts from this blog

A B V High School Friends Stories -1

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju

Bhagavad-Gita (Purushottama Yoga 15.1 shloka