Related to Science

 గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొన్నది ఎవ్వరు .?

గురుత్వాకర్షణ సిద్ధాంతం తెలుసుకోవడం లో భారతదేశంలో ఏమైనా అధరాలు ఉన్నాయా ? 

ఐతే ఇది చదవండి మీ అనుమానం తొలగిపోతుంది.

గురుత్వాకర్షణ సిద్ధాంతం ( Law of Gravitation) కనుగొన్నది న్యుటనా!? ఇది పూర్తిగా అసత్యం. ఎందుకంటే ప్రాచీన భారతీయ గ్రంధాల నిండా గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి ప్రస్తావించబడి వుంది.

1) “సూర్య సిద్దాంత” మనే ప్రాచీన గ్రంధంలో ఇలా చెప్పబడింది. “ధారణాత్మక శక్తి కారణంగా భూమి ఆకాశంలో పడిపోకుండా నిలబడుతున్నది.

(సూ.సి. 12 అ – 32 శ్లోII)

శ్లో II మధ్యే సమన్తదన్నస్య భూగోళో వ్యోమ్ని తిష్టతిI

___బీభ్రాణః పరమాం శక్తిం బ్రాహ్మణో ధారణాత్మికామ్II

2) వరాహమిహురుడు (శాలివాహనాశకం . 505) తన “పంచ సిద్ధాంతి” అనే గ్రంధంలో గురుత్వాకర్షణ శక్తి గురించి  “భుతలంలోని ఏ భాగంలో అయిన .. అన్ని జ్వాలలు పైకేగుస్తాయి.. పైకి వేసిన వస్తువు కింద పడుతుంది. ఈ అనుభవం అందరికి తెలిసినదే. సమానమైనదే” అని అంటాడు.

(పం.సి. 13 అ – శ్లోII)

శ్లోII గగనము పైతి శిభిశిఖ క్షిప్తమపి క్షితముపితి గురు కించిత్I

___యధ్వదిహ మానవానాం అసురానం తద్వాదేవాజ్ఘః II

3) “లీలావతి” అనే గ్రంధంలో “భువనకోశం” అనే సర్గలో భాస్కరాచార్యుడు (శాలివాహనాశకం 1114) తన పుత్రిక లీలావతికి “భూమి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది. ఖగోళంలో గ్రహాల పరస్పర ఆకర్షణ శక్తి వల్ల అవి అక్కడ తమకు తామే ఆధారభూత మై నిలిచి ఉన్నాయని” చక్కగా వివరించారు.

4) “సిద్దాంత శిరోమణి” (భాస్కరాచారుడు) అనే గ్రంధంలో “భువనకోశం” అనే అధ్యాయంలో 6వ శ్లోకంలో గురుత్వాకర్షణ శక్తి గురించి చాలా చక్కగా వివరించారు.

శ్లోII ఆకృష్టిశక్తిశ్చ మహితయా యత్ స్వస్థం/గురు స్వాభిముఖం స్వశక్త్యా

___ఆకృష్యతే తత్పతతీవభాతి/సమే సమన్తాత్ క్వ పతత్వియం ఖేII

భూమి ఆకాశంలో ఉన్న వస్తువులను సహజంగా, స్వశక్తితో .. తన వైపునకు ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ వలన అన్ని వస్తువులు భూమి మీద పడతాయి. ఆకాశంలోని వివిధ గ్రహాల మధ్య సమాన ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు అవి ఎక్కడ పడతాయి.

5) బ్రహ్మగుప్తుడు (శాలివాహనాశకం.591) రచించిన “బ్రహ్మాస్పుఠ సిద్ధాంతం” లో “వస్తువులు భూమి వైపు ఆకర్షింపబడతా యి. నీటికి ఎలా సహజ ప్రవాహశక్తి ఉన్నదో, అలా భూమికి సహజమైన ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పారు.

6) జగద్గురువు అదిశంకరులవారు వారి “ప్రశ్నోపనిషత్” భాష్యంలో “అపాన” శక్తి గురించి రాస్తూ .. “ఒక వస్తువును పైకి ఎగురవేస్తే దానిని ఎట్లు భూమి ఆకర్షిస్తుందో, అటులనే పైకి లాగబడే “ప్రాణ” శక్తిని “అపాన” శక్తి కిందకు కిందకు లాగుతుంది.

(3-8 శ్లోII) అని చెప్పారు.

శ్లోII తధా పృధివ్యామభిమానినీ యా దేవతా ప్రసిద్ధా సైషా

___పురుషస్య అపానవృత్తిమవష్టభ్యాకృష్య వశీకృత్యాధ ఏవ

అపకర్షేణ హి శరీరం గురుత్వాత్ పతేత్ సావకాశే వోద్గాచ్చేత్II”

ఆ తరవాతి భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల గ్రంధాలలో కూడా “గురుత్వాకర్షణ” సిద్ధాంతం వివరింపబడి ఉంది. న్యుటన్ కి ముందే ఎన్నో వందల, వేల సంవత్సరాల పూర్వమే “గురుత్వాకర్షణ” గురించి భారతీయ విజ్ఞానం ఘోషించింది.

ఇంతటి విశిష్టమైన భారతీయ గొప్పతనాన్ని “జన విజ్ఞాన” సంఘం అంటూ చైనా శక్తులు భారతీయ విద్యా విధానం ఒక బూటకం అంటూ నిందలు వేస్తున్నారు. ఇది భారతీయులు సాధించిన విజయం.. మన పూర్వ గ్రంధాలను దోచుకువెళ్ళి ఆ గ్రంధాలపై విశ్లేషణ జరిపి విదేశాలలో చాలామంది మేమే గురుత్వాకర్షణ శక్తి కోసం కనిపెట్టి వివరించాము అని చెప్పుకోవడం హాస్యాస్పదం ..

ఈసారి ఎవ్వరైనా గురుత్వాకర్షణ శక్తి కోసం అడిగితే గర్వగా చెప్పండి “సూర్య సిద్దాంత” “పంచ సిద్ధాంతి” “లీలావతి” “సిద్దాంత శిరోమణి” “బ్రహ్మాస్పుఠ సిద్ధాంతం” “ప్రశ్నోపనిషత్” మా పూర్వికులు ఆ గురుత్వాకర్షణ శక్తి కోసం సరైన విశ్లేషణ ఇచ్చారు .. అంతకు మించిన సమాచారం ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు నేటికి ఇవ్వలేకపో యారు అని ...

మన భారతీయ చరిత్రను వక్రీకరించారు అనడానికి ఇది ఖచ్చితమైన ఉదాహరణ ... కాదంటారా ..???

(source : internet)

***********************************************************************************

వాగ్దేవతలు

*తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :

"అ" నుండి "అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధం.

"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం"అంటారు.

ఈ సౌరఖండం లోని "క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి".! అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం

"చ, ఛ, జ, ఝ, ఞ" గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".! అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.

"ట, ఠ, డ, ఢ, ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల".! అంటే మలినాలను తొలగించే దేవత.

"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ".! కరుణను మేలుకొలిపేదే అరుణ.

ప, ఫ, బ, భ, మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని." అనగా జయము ను కలుగ చేయునది.

అలాగే "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం" అంటారు. అలాగే అగ్ని ఖండంలోని "య, ర, ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి." అంటే శాశించే శక్తి కలది సర్వేశ్వరి.

ఆఖరులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష" లకు అధిదేవత "కౌలిని"

ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.

ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.

అంటే బ్రహ్మమే శబ్దము.

ఆ బ్రహ్మమే నాదము.

మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.

అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది.

భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి "అమ్మ"ను అర్చిస్తున్నాయి.

కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.

మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత.

మనం చేసే శబ్దమే...ఆ దేవత..!

మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.

ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.

ఇది సనాతన ధర్మం.

ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

                                                                   Sushruta




###############################################################################


Imagine the extent of Bharat then ..

In 1872, British India, also known as the British Raj, encompassed a vast territory that included many present-day countries and regions. Here are some of the countries that were partially or entirely part of British India in 1872:

1. India
2. Pakistan
3. Bangladesh
4. Nepal (parts were under British influence)
5. Bhutan (under British protection)
6. Myanmar (Burma)
7. Sri Lanka (Ceylon)

Additionally, British India also included:

1. Afghanistan (parts were under British influence)
2. Tibet (parts were under British influence)
3. Maldives

                                                                       By Dr. Mahendra Raju

**************************************************************************
మనం మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా  త్రాగాలి ?

    అన్ని రోగాలకి చికిత్సకంటే , రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానము అంటారు మహర్షి వాగ్భటాచార్యుడు . 

    "భోజనాంతే విషం వారీ" , అంటే భోజనం చివర నీరు త్రాగటం "విషం"*తో సమానం . మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది . అక్కడ అగ్ని *( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది . ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది . ఇది ప్రధానమైన విషయం . 

    భోజనం తిన్న తరువాత నీళ్ళు త్రాగితే జఠరాగ్ని చల్లబడుతుంది . ఇక తిన్న ఆహారము అరగదు . అది కుళ్ళి పోతుంది . కుళ్ళిన ఆహారం నుండి వచ్చిన విషయవాయువులు శరీరమంతటా వ్యాపిస్తాయి . ఆ విషయవాయువుల వలన 103 రోగాలు వస్తాయి . ఆ కుళ్ళిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల , ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు. 

నీరు త్రాగే విధానం :-- 
  నీటిని గుటక గుటకగా త్రాగాలి . ఒక్కొక్క గుటక నోటిలో నింపుకంటూ చప్పరిస్తూ త్రాగాలి . వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి . నీరు ఎపుడు త్రాగినా ఈ విధంగానే త్రాగాలి . ఇది నీరు త్రాగే సరైన విధానం . గటగటా నీరు త్రాగడం సరైన విధానం కాదు.

ఫలితము :---
    నీటిని గుటక గుటక చప్పరిస్తూ త్రాగితే నోటిలోన వున్న లాలాజలంతో నీరు కలిసి పొట్టలోకి చేరుతుంది . పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి . లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది . అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి , లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికి . అపుడు మనం జీవితాంతం ఏ రోగాల బారినపడకుండా ఆరోగ్యంగా జీవించ వచ్చును. 

ఎప్పుడు త్రాగాలి : ---- 
 బ్రేక్ ఫాష్ట్ లేక భోజనమునకు గంట ముందు నీళ్ళు త్రాగాలి . 
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం చేసిన గంట న్నర తరువాత త్రాగాలి . (ఆహారం జఠర స్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీప్తమై ఉంటుంది). అపుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది‌ . 

భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్ఛును . భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసము , గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును . 
# ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తరువాత పండ్లరసాలు త్రాగవచ్ఛును .
# మధ్యాహ్న భోజనం తరువాత మజ్జిగ త్రాగవచ్చును . 
# రాత్రి భోజనాంతరము పాలు త్రాగవచ్చు .

      ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు . ఎందుకంటే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స్ ఆ సమయాల్లో మాత్రమే మన శరీరంలో ఉత్పన్నమవుతాయి . 

నీరు ఎంత త్రాగాలి : --
    మీరున్న బరువును 10 తోటి భాగించి 2 ను తీసివేస్తే వచ్చినది మీరు త్రాగవలసిన నీటి శాతం చూసుకొని త్రాగండి . ఉదా: మీరు 60 కిలోల బరువు వుంటే 60 ని 10 చే భాగించితే 6 వస్తుంది . దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది.  మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు త్రాగవలెను . 

ఎలా త్రాగాలి :-- 
# ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చొని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగాలి . 
# నిలబడి నీళ్ళు త్రాగరాదు . 
# చల్లని నీళ్ళు ( Cool Water)  త్రాగరాదు . 
# గోరు వెచ్చని నీళ్ళు త్రాగవలెను . 
# ఎండాకాలములో ( మార్చి నుండి జూన్) మట్టికుండలోని నీరు త్రాగవలెను . 

*మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు. 
* మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు . 
* స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు. 

మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన మూత్ర సంబంధ  వ్యాధులు వస్తాయి . 
మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన యెడల మలబద్ధకం వస్తుంది . 
స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన యెడల చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి . 
ఎండ నుండి నీడకు వచ్చి వెంటనే నీళ్ళు త్రాగితే సమస్యలు వస్తాయి . 
రిఫ్రిజిరేటర్ నీళ్ళు చాలా హానికరము . 

    మనకు ఆహారము ఎంత ప్రధానమో , తిన్న ఆహారము సక్రమంగా జీర్ణమటం అంతే ప్రధానము .  

   మనము తిన్న భోజనము జీర్ణము కాని యెడల అది కుళ్ళిపోతుంది . ఆ కుళ్ళిన ఆహారము వలన శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది . మొట్టమొదట గ్యాస్ ట్రబుల్ ,  గొంతులో మంట , గుండెలో మంట , ఎసిడిటీ , హైపవర్ ఎసిడిటీ , అల్సర్ , పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి . చివరగా క్యాన్సర్.  

      మీరు ఎల్లప్పుడూ నీటిని గుటక 
 చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా త్రాగండి.

( ఇది సోషల్ మీడియా మెసేజ్, ఇందులో ఏమయినా పొరపాటులు వుంటే సరి చేయవచ్చును.)

************************************************************************


కార్తీక వనభోజనాల విశిష్ఠత
🪷🪷🪷🪷🪷🪷🪷

వనభోజనాం
🌸🌸🌸🌸🌸

‘వనము’ అంటే అనేక వృక్షముల సముదాయము. ముఖ్యంగా రావి, మఱ్ఱి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస, ఇత్యాది వృక్షాలతో.., తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ, మొక్కలతో., రకరకాల పూల మొక్కలతో కూడివుండాలి. దాహము వేస్తే దప్పిక తీర్చడానికి ఓ సెలయేరు ఉండాలి. ఇవి ఉన్నచోట  జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, చిలుకలు మొదలైన సాదు ప్రాణులు తప్పకుండా ఉంటాయి. దానినే ‘వనము’ అంటారుగానీ..., అడవిని ‘వనము’ అనరు. ‘వనము’ అంటే, వసించడానికి అనువైన ప్రదేశము అన్నమాట. వేటకు, క్రూరత్వానికి తావులేనిది ‘వనము’. అట్టి వనము దేవతా స్వరూపము. ఎందుకంటే.. పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు.., దేవతలకూ, మహర్షులకూ ప్రతిరూపాలు. ప్రశాంతతకు, పవిత్రతకు ఆలవాలమైన తపోభూమి. నిర్భయంగా విహరించడానికి అనువైన ప్రదేశము. అట్టి వనాలను యేడాదికి ఒక్కసారైనా., ప్రత్యేకించి కార్తీకమాసంలో దర్శించండి అని మన పూర్వులు నియమం పెట్టారు. అందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆనందకరమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. అవి ఏమిటంటే....

- కార్తీకమాసం నాటికి... వానలు ముగిసి, వెన్నెల రాత్రులు ప్రారంభమౌతాయి.  చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణంతో మనసుకు ఆనందాన్ని., ఆహ్లాదాన్ని కలిగించే మాసం.... ఈ కార్తీకమాసం. 
- ఆధ్యాత్మికపరంగా.,శివ,కేశవులకు ప్రీతికరమైనది ఈ కార్తీకమాసం. అందుచేత శివ, కేశవ భక్తులు ఒకచోట చేరి,  ఐకమత్యంతో ఆనందంగా గడపడానికి అవకాశం కల్పించే మాసం.... ఈ కార్తీకమాసం.
- పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు, చెట్లు పచ్చగాచిగిర్చి,పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపజేసే మాసం.. ఈ కార్తీకమాసం.  

పుణ్యప్రదమైన ఈ కార్తీకమాసంలో ‘వనవిహారం చేసిరండి’ అంటే ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే.. ఆకలేస్తే.. అక్కడ  వండి, వార్చి పెట్టేవారెవరు? అందుకే ‘వనభోజనాలు’ ఏర్పాటు చేసారు మన పెద్దలు. ‘దేవుడి మీద భక్తా?  ప్రసాదం మీద భక్తా?’ అంటే.. పైకి అనక పోయినా...‘ప్రసాదం మీదే భక్తి’ అనే రకం మనవాళ్ళు. కనీసం భోజనంమీద భక్తితోనైనా వనవిహారానికి వచ్చేవారున్నారు. స్వార్ధంలో పరమార్ధం అంటే ఇదే.

ఇక వనభోజనం అంటే... కేవలం తిని, తిరగడమే కాదు. దానికో పద్ధతి, నియమం ఉంది. కాలకృత్యాలు, స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత..అందరు బంధు, మిత్రులు, పరిచయస్తులు, ఇరుగు, పొరుగు కలిసి, జాతి, మత, కుల వివక్షత లేకుండా.., వీలయితే ఒకే వాహనంలోగానీ., లేదా రెండు వాహనాలలోగానీ వారు ఎంచుకున్న వనానికి సూర్యోదయానికి పూర్వమే చేరుకోవాలి. ముందుగా ఓ వటవృక్షం క్రింద ఇష్టదేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో చక్కగా అలంకరించాలి. ఆనందం పంచుకోవాలంటే వంటవాళ్ళను తీసుకెళ్ళ కూడదు. మగవారు పాటలు పాడుతూ కూరలు తరుతూంటే.. ఆడవారు చీరకొంగులు నడుముచుట్టి., అందరూ తలోరకం వంట వండుతూంటే...ఉన్న ఆనందమే వేరు. పిల్లలంతా కలిసి చేసే అల్లరిలోని మజాయే వేరు. చాటుమాటు కన్నెచూపుల, కుర్రచూపుల కలయికలోని ఖుషీయే వేరు. కొత్తజంటల గుసగుసల తమాషాల వాడే వేరు. అనుభవంతో తలపండిన పెద్దల ఛలోక్తుల చురకల వేడే వేరు. ఇన్నిరకాల ఆనందాల మధ్య., ఆచారాలకూ, నియమాలకూ అంత ప్రాధన్యత లేదు. అన్ని రకాల సాంప్రదాయాలకూ., సంస్కృతులకూ సమాన వేదిక ఇధి.

సామూహికంగా కలసి చేసిన శాకాహార వంట పూర్తి అయిన తర్వాత., ఆ వండిన పదార్థాలను పూజాస్ధలానికి చేర్చి..,అందరూ కలిసి దేవతారాధన చేసి., నివేదన సమర్పించి, ఆ ప్రసాదాన్ని అందరూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తింటూంటే., ‘అబ్బ...సామూహిక సహజీవనంలో ఇంత రుచి ఉందా!’ అని అనిపించక మానదు. అమ్మయ్య.. సమిష్టి భోజనాలయ్యాయి. మరి తిన్నది అరగాలి కదా! ఇక ఆటపాటలదే ప్రముఖస్థానం. అంతరించిపోతున్న ప్రాచీన సాంప్రదాయ ఆటలకు సమాన వేదిక ఈ ‘వనభోజనాలు’. ఈ ఆట పాటల్లోనే కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు కలుగుతాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కార్తీకంలో కలిసిన ఈ కొత్తసంబంధం..బంధుత్వంగా మారడానికి., మాఘ, ఫాల్గుణాల ముహూర్తాలు మనకోసం మనముందే ఉన్నాయి.
🙏🏻🙏🏻🙏🏻

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

సంస్కృత పేర్లు కాబట్టి ఇవి ఏవిటో అనుకుంటున్నాం కానీ, 
వీటి పేర్లు మన వాడుక భాషలో మనందరికీ తెలిసిన పేర్లే అండి 👍

మాచీ పత్రం అంటే చేమంతి ఆకులు,
దూర్వా పత్రం అంటే గరిక,
అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకులు,
దత్తూరపత్రం అంటే ఉమ్మెత్త ఆకులు,
బిల్వ పత్రం అంటే మారేడు దళాలు,
బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకులు,
చూత పత్రం అంటే మామిడి చెట్టు ఆకులు,
కరవీరపత్రం అంటే గన్నేరు ఆకులు,
మరువక పత్రం అంటే మనం పూలకుండీల్లో పెంచుకునే మరువం & ధవనం, 
శమీ పత్రం అంటే జమ్మి చెట్టు ఆకులు,
సింధువార పత్రం అంటే వావిలి ఆకులు, నీళ్లలో మరిగించి ఆ నీళ్ళతో స్నానం చేస్తే body pains తగ్గుతాయి అని విన్నాం కదా అవేనండి వావిలి ఆకులు, 
అశ్వత్ధ పత్రం అంటే రావిచెట్టు ఆకులు,
దాడిమీ పత్రం అంటే దానిమ్మపళ్ళ చెట్టు ఆకులు, 
జాజి పత్రం అంటే సన్నజాజి, మల్లి, మొదలైన ఆకులు, 
అర్జున పత్రం అంటే మద్ధిచెట్టు ఆకులు, 
అర్క పత్రం అంటే జిల్లేడు ఆకులు 
ఇలా ఇవన్నీ మనకు తెలిసిన పేర్లే అండి,
చాలా వరకూ ఈ పత్రులు దొరుకుతాయి అండి 👍
వినాయక చవితి ముందురోజున 
కూరగాయల మార్కెట్ లో 
ప్రత్యేకించి ఈ పత్రులు  అమ్ముతారు అండి 👍

**************************************************************************

Comments

Popular posts from this blog

Amazing Child Artist and other stories-- Dr. Muralidhar

A B V High School Friends - Discussions (Questions were put by Dr.Muralidhar

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju