Samudra Manthanam

  Courtesy :Sri Mahendra Raju


శ్రీ మదాంధ్ర భాగవతం➖ (57వ భాగం)

పామును మంధరపర్వతమునకు చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి. అది క్రిందకు జారిపోకూడదు. దేవదానవులిరువురూ చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. భుగభుగభుగమని పాలసముద్రం లేచింది. నురగలు లేచాయి. కెరటములు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమయిన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు మంధరపర్వతమును గిరగిర తిప్పేస్తున్నారు. 

వాసుకి ‘మీరు సరిగ్గా చిలకడం లేదు వదలండి’ అని కేకలు వేశాడు. 

వాళ్ళందరూ వాసుకిని వదిలేశారు. పట్టు తప్పిపోయి మంధర పర్వతం జారి క్రిందపడిపోయింది. 

అందరూ శ్రీమన్నారాయణుని వైపు చూశారు. 

ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారమును స్వీకరించాడు. 

కొన్ని లక్షల యోజనముల వెడల్పయిన పెద్ద డిప్ప. ఆ డిప్పతో పాలసముద్రం అడుగుకి వెళ్ళి ఇంతమంది కదల్చలేని మంధరపర్వతమును తన వీపుమీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తుండమును అటూ ఇటూ ఆడిస్తున్నాడు. తన నాలుగు కాళ్ళను కదల్చకుండా తానే ఆధారమయి, మంధరపర్వతమును వీపుపై ధరించి ఉన్నాడు. 

ఆ కూర్మము నిజంగా ఆహారమును తినినట్లయితే ఈ బ్రహ్మాండములనన్నిటిని జీర్ణము చేసుకొనగలదు. అటువంటి ఆదికూర్మమై పాలసముద్రం క్రింద పడుకున్నాడు. 

ఇపుడు మంధరపర్వతమును ఆదికూర్మం భరిస్తోంది. మరల మంధరపర్వతమును వాసుకిని చుట్టి రాక్షసులు తలవైపు దేవతలు తోకవైపు ఉండి చిలకడం ప్రారంభించారు. 

భూమి అదిరిపోతోంది. సముద్రంలోంచి కెరటములు పైకి లేస్తున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆకాశంలో నిలబడిపోయి ఆ దృశ్యమును చూస్తున్నారు.

ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారు భావసమాధిలో ఉన్నారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. 

* ** * * * * * * * * * * * * * * * * * * * * ************************* * * * * * * * * * * * * * * 

                                               

 వామనుడు గర్భస్తుడగుట

               తన కడుపున నొక యిరువున 

            వనరుహ గర్భాండ భాO వనధిచయంబుల్   

              గొనకొని జగముల్ నిడుకొని 

              తను గతి గడు నడఁగిమడిగి తనరెం బెడగై

                         

                          

           కం. విచ్చేయు మదితి  గర్భము 
                  చెచ్చెర వెలువడి మహాత్మ! చిరకాలంబున్
                   విచ్ఛలవిడి లే కమరులు
                   ముచ్చటపడి యున్నవారు ముద
                   మందింపన్ 
    
       


                     

కంద పద్యం 8. 541

వెవెడ నడకలు నడచుచు 
నెనెడ నడుగిడక నడరి యిలా దిగ బడగా
బుడిబుడి నొడువులు నొడుచుచు 
జిడిముడి తడబడగ వడుగు చేరేన్ రాజున్.

          

   

Comments

Popular posts from this blog

Amazing Child Artist and other stories-- Dr. Muralidhar

A B V High School Friends - Discussions (Questions were put by Dr.Muralidhar

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju