gayatri Mantra Vishleshana
గాయత్రీ_మంత్రమనేది_ఒకటివుందని
#తెలిసినా_అదేమిటో_అసలు_ఎలా_జపించాలో_తెలియదు🙏🙏
కొందరికి మంత్రము తెలిసినా కాలంతో
పాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.
నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.
గాయత్రీ మంత్రము అంటే…
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…
ఓం
భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.
ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.
గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.
1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.
2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.
3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.
4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.
5. 24 కేశవ నామాలు
6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు
7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”
8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.
9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు
10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.
11. మన వేనుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.
“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.
!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Courtesy : Sri. Chiluveru Ramachandra Murthy
***********************************************************************************
హరిఓం రఘా, లాలసమ్మ మీరు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది. మీరు చెప్పిన దానికి అదనంగా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. మనం మూడు సార్లు శాంతి శాంతి శాంతి అని ఎందుకంటామంటే ...
1.ఆది దైవిక
2.ఆది భౌతిక
3.అధ్యాత్మికo గా
మనకు శాంతి కలగాలనీ ప్రార్ధిస్తాము.
చిన్న ఉదాహరణ... ఈ రోజు రాత్రి నేను పడుకునే ముందు రేపు ఉదయం చాముండి దేవస్థానం వెళ్ళాలి భగవంతుడా! అని ప్రార్థన చేసి శాంతి శాంతి శాంతి అని పడుకుంటాననుకోండి.
1.మొదటి శాంతి... దైవికంగా ఎట్టి ఆటంకం కలుగరాదు. అంటే జోరు వర్షమో, ల్యాండ్ స్లయిడ్, భూకంపం లాంటి దైవిక ఆటంకాలు రాకుండా కాపాడు దేవా.
2.రెండవ శాంతి.. భౌతికంగా అంటే శరీరకంగా నాకు జ్వరమో, తలనొప్పో, వాంతి, విరోచనాలో రాకుండ కాపాడు దేవా.
3.మూడవ శాంతి... అధ్యాత్మికంగా అంటే నా అంతరాత్మ నిర్ణయాన్ని మార్చరాదు. ఈ రోజువద్దులే మళ్ళీ ఎపుడైనా వెళ్లుదాం అని నీరసానికి లొంగిపోకుండా చూడు భగవంతుడా!
మొదటి శాంతి జోరుగా ఉచ్చారణ చేస్తాము భగవంతుని పిలవడానికి,
రెండవ శాంతి కొంచం తక్కువ స్థాయిలో అంటాము మన శరీరానికి వినపడేలా,
మూడవ శాంతి ఇంకా తక్కువ స్థాయిలో అంటాము ఎందుకంటే ఆత్మ మనలోపలే వుంది కాబట్టి.
ఇదే శాంతి శాంతి శాంతి అని మూడు సార్లు అనటానికి నాకు తెలిసిన విషయం. లాలసమ్మ చెప్పిన విషయం కూడా కరెక్ట్. జ్ఞానులకు ఇంకా ఎన్నో విషయాలు తెలిసుంటాయి. నాకు తెలిసింది సముద్రం లో నీటి బిందు ప్రమాణమే. 🕉️🕉️🕉️🙏🙏🙏
Comments
Post a Comment