Stories Courtesy Dr Mahendra Raju

Senior citizen day in India is on 21st August]

  𝑴𝑰𝑵𝑰𝑴𝑰𝒁𝑬:

  1. 𝑺𝒂𝒍𝒕.

  2. 𝑺𝒖𝒈𝒂𝒓.

  3. 𝑩𝒍𝒆𝒂𝒄𝒉𝒆𝒅 𝒇𝒍𝒐𝒖𝒓.

  4. 𝑫𝒂𝒊𝒓𝒚 𝒑𝒓𝒐𝒅𝒖𝒄𝒕𝒔.

  5. 𝑷𝒓𝒐𝒄𝒆𝒔𝒔𝒆𝒅 𝒑𝒓𝒐𝒅𝒖𝒄𝒕𝒔.

  𝑭𝑶𝑶𝑫 𝑵𝑬𝑬𝑫𝑬𝑫:

  1. 𝑽𝒆𝒈𝒆𝒕𝒂𝒃𝒍𝒆𝒔;

  2. 𝑳𝒆𝒈𝒖𝒎𝒆𝒔;

  3. 𝑩𝒆𝒂𝒏𝒔;

  4. 𝑵𝒖𝒕𝒔;

  5. 𝑬𝒈𝒈𝒔;

  6. 𝑪𝒐𝒍𝒅 𝒑𝒓𝒆𝒔𝒔𝒆𝒅 𝒐𝒊𝒍 (O𝒍𝒊𝒗𝒆, C𝒐𝒄𝒐𝒏𝒖𝒕, ...)

  7. 𝑭𝒓𝒖𝒊𝒕𝒔.

 𝑻𝑯𝑹𝑬𝑬 𝑻𝑯𝑰𝑵𝑮𝑺 𝒀𝑶𝑼 𝑺𝑯𝑶𝑼𝑳𝑫 𝑻𝑹𝒀 𝑻𝑶 𝑭𝑶𝑹𝑮𝑬𝑻:

  1. 𝒀𝒐𝒖𝒓 𝑨𝒈𝒆.

  2. 𝒀𝒐𝒖𝒓 𝑷𝒂𝒔𝒕.

  3. 𝒀𝒐𝒖𝒓 𝑪𝒐𝒎𝒑𝒍𝒂𝒊𝒏𝒕𝒔.

 𝑬𝑺𝑺𝑬𝑵𝑻𝑰𝑨𝑳 𝑻𝑯𝑰𝑵𝑮𝑺 𝒀𝑶𝑼 𝑵𝑬𝑬𝑫 𝑻𝑶 𝑪𝑯𝑬𝑹𝑰𝑺𝑯:

  1. 𝒀𝒐𝒖𝒓 𝑭𝒂𝒎𝒊𝒍𝒚; 

  2. 𝒀𝒐𝒖𝒓 𝑭𝒓𝒊𝒆𝒏𝒅𝒔; 

  3. 𝒀𝒐𝒖𝒓 𝒑𝒐𝒔𝒊𝒕𝒊𝒗𝒆 𝒕𝒉𝒐𝒖𝒈𝒉𝒕𝒔;

  4. 𝑨 𝒄𝒍𝒆𝒂𝒏 𝒂𝒏𝒅 𝒘𝒆𝒍𝒄𝒐𝒎𝒊𝒏𝒈 𝒉𝒐𝒎𝒆.

 𝑻𝑯𝑹𝑬𝑬 𝑩𝑨𝑺𝑰𝑪 𝑻𝑯𝑰𝑵𝑮𝑺 𝒀𝑶𝑼 𝑵𝑬𝑬𝑫 𝑻𝑶 𝑨𝑫𝑶𝑷𝑻:

  1. 𝑨𝒍𝒘𝒂𝒚𝒔 𝒔𝒎𝒊𝒍𝒆 / 𝒍𝒂𝒖𝒈𝒉.

  2. 𝑫𝒐 𝒓𝒆𝒈𝒖𝒍𝒂𝒓 𝒑𝒉𝒚𝒔𝒊𝒄𝒂𝒍 𝒂𝒄𝒕𝒊𝒗𝒊𝒕𝒚 𝒂𝒕 𝒚𝒐𝒖𝒓 𝒐𝒘𝒏 𝒑𝒂𝒄𝒆.

  3. 𝑪𝒉𝒆𝒄𝒌 𝒂𝒏𝒅 𝒄𝒐𝒏𝒕𝒓𝒐𝒍 𝒚𝒐𝒖𝒓 𝒘𝒆𝒊𝒈𝒉𝒕.

 𝑺𝑰𝑿 𝑬𝑺𝑺𝑬𝑵𝑻𝑰𝑨𝑳 𝑳𝑰𝑭𝑬𝑺𝑻𝒀𝑳𝑬 𝒀𝑶𝑼 𝑵𝑬𝑬𝑫 𝑻𝑶 𝑷𝑹𝑨𝑪𝑻𝑰𝑪𝑬:

  1. 𝑫𝒐 𝒏𝒐𝒕 𝒘𝒂𝒊𝒕 𝒖𝒏𝒕𝒊𝒍 𝒚𝒐𝒖 𝒂𝒓𝒆 𝒕𝒉𝒊𝒓𝒔𝒕𝒚 𝒕𝒐 𝒅𝒓𝒊𝒏𝒌 𝒘𝒂𝒕𝒆𝒓.

  2. 𝑫𝒐 𝒏𝒐𝒕 𝒘𝒂𝒊𝒕 𝒖𝒏𝒕𝒊𝒍 𝒚𝒐𝒖 𝒂𝒓𝒆 𝒕𝒊𝒓𝒆𝒅 𝒕𝒐 𝒓𝒆𝒔𝒕.

  3. 𝑫𝒐 𝒏𝒐𝒕 𝒘𝒂𝒊𝒕 𝒖𝒏𝒕𝒊𝒍 𝒚𝒐𝒖 𝒂𝒓𝒆 𝒔𝒊𝒄𝒌 𝒕𝒐 𝒉𝒂𝒗𝒆 𝒎𝒆𝒅𝒊𝒄𝒂𝒍 𝒆𝒙𝒂𝒎𝒊𝒏𝒂𝒕𝒊𝒐𝒏𝒔.

  4. 𝑫𝒐 𝒏𝒐𝒕 𝒘𝒂𝒊𝒕 𝒇𝒐𝒓 𝒎𝒊𝒓𝒂𝒄𝒍𝒆𝒔 𝒕𝒐 𝒕𝒓𝒖𝒔𝒕 𝑮𝒐𝒅.

  5. 𝑵𝒆𝒗𝒆𝒓 𝒍𝒐𝒔𝒆 𝒄𝒐𝒏𝒇𝒊𝒅𝒆𝒏𝒄𝒆 𝒊𝒏 𝒚𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒇..

 6. 𝑺𝒕𝒂𝒚 𝒑𝒐𝒔𝒊𝒕𝒊𝒗𝒆 𝒂𝒏𝒅 𝒂𝒍𝒘𝒂𝒚𝒔 𝒉𝒐𝒑𝒆 𝒇𝒐𝒓 𝒂 𝒃𝒆𝒕𝒕𝒆𝒓 𝒕𝒐𝒎𝒐𝒓𝒓𝒐𝒘 ...

 𝑰𝑭 𝒀𝑶𝑼 𝑯𝑨𝑽𝑬 𝑭𝑹𝑰𝑬𝑵𝑫𝑺 𝑰𝑵 𝑻𝑯𝑰𝑺 𝑨𝑮𝑬 𝑹𝑨𝑵𝑮𝑬 (47-90 𝒀𝑬𝑨𝑹𝑺), 𝑷𝑳𝑬𝑨𝑺𝑬 𝑺𝑬𝑵𝑫 𝑻𝑯𝑰𝑺 𝑻𝑶 𝑻𝑯𝑬𝑴.

 *🌹HAPPY SENIOR CITIZENS' MONTH 🎉Pass to every Senior Citizens you know.*🪷

***********************************************************************************

  ".విధి విసిరే చివరి అస్త్రం " ముసలితనం!

*వృద్ధాప్యపు బందిలదొడ్డిలో నువ్వు ఒంటరివి.!!

*వృద్ధోపనిషత్ లోని  ప్రతీ పేజీ… 'మసకే' ,సాయం తక్కువ…సలహాలు ఎక్కువ..!!

*మనిషి ఏడో రుతువే…"వృద్ధాప్యం".!!

*కాలధర్మంలో  దేహధర్మమే "వృధ్ధాప్యం"!!

*మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం  వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు

  ‌ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి!!

ఈ లోకంలో పుట్టిన ప్రతీవాడు"వృద్ధోపనిషత్"లో భాగస్వామి కాక తప్పదు.జీవితం భళ్లున తెల్లవారుతుంది.. మెల్లగా చీకటి పడుతుంది.

వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి వుంది.అంటే వృద్ధాప్యంలో వెనుక చూపేతప్ప 

ముందు చూపు వుండదు.జీవితంలోమనం… ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక అయితే వృద్ధాప్యంలో  దాన్నెవరూగుర్తించరు. అసలు పట్టించుకోరు.‌ ఓ సారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగుపెడితే సమాజం మన గురించి పట్టించుకోదు.పాత వస్తువులా….ఓ  పక్కనపడేస్తుంది.

"ఆరోజుల్లో..నేను."అంటూ గతవైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్ ఆలోచన  వుండదు.

కాళ్ళు,కీళ్ళుఒళ్ళు సడలి,కదల్లేక,మెదల్లేక, దేహాన్ని వదల్లేక, ఏమీ చేయలేక,..వృద్ధులు పడే మనో

వ్యధ అంతాఇంతాకాదు.‌

వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు.జనం.నిజానికి వృద్ధాప్యం శాపమో

పాపమో కాదు. అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యం రాగానే బయటివాళ్ళు సరే కుటుంబ సభ్యులు‌ కూడా చులకనగాచూస్తారు. నిన్న మొన్నటిదాకా.తలొంచిన వానపాములు సైతం తలెగరేసి, నిలదీస్తాయి.లెక్కలు  అడగటం మొదలెడతాయి.!

"ఏమండీ / నాన్నగారూ." అంటూ  విధేయంగా వుండే  భార్యాపిల్లలుకూడా ధిక్కరించడం మొదలు పెడతారు.వాళ్ళేదో పుడింగులన్నట్లులేనిపోని సలహాలు,సూచనలిస్తుంటారు.ఏంమాట్లాడినా, యేం చేసినా వాళ్ళకు నచ్చదు సరికదా 'చాదస్తం ' అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు. లోకువగా చూస్తారు.!

*మధ్యతరగతి కుటుంబం అయితే, మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా? లేక చూసీ చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మనవాళ్ళే చర్చిస్తూ ఉంటారు.*

*అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది.! ఆ రాత్రి నిద్ర కరువవుతుంది.

*చివరి మజిలీ !!

మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం.(Old Age)మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృధ్ధాప్యం.మనిషి జీవితం రుతువులతో ముడిపడి వుంటుంది.వసంత రుతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుక అనుకుంటే,శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా,రంగు రంగుల పూలతో మురిపిస్తుంది. మనసు ఉల్లాసభరితమవుతుంది.

ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి,ఎండి ,రాలి , చెట్లు మోడులవుతాయి.అలాగే వృద్ధాప్యంలో…

మనిషి దేహం కూడా ఒడలి, ఎండిన మోడవు.తుంది.!అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే..

జీవితంలో వాళ్ళుఎన్నెన్ని చూసివుంటారు. ఎంత అనుభవంగడించి వుంటారో!ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. వారి అనుభవాన్ని యువతరం  చూపుడువేలుగా తీసుకొని ముందుకు నడవాలి.

అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా వుంటుంది. కానీ దురదృష్టంయేమంటే, వృద్ధుల్ని గౌరవించడం  అటుంచి  అసలులెక్కేచేయరు.!.

కొందరైతే ముసలాళ్ళను భరించలేక  వృద్ధాశ్రమాలపాలు చేస్తారు. ఇవాళ మనం చేసిందే..రేపు మన పిల్లలు కూడా చేస్తారన్నసోయి ఏమాత్రం వుండదు. ఏతావాతా వృద్ధాప్యం శాపంగా మారుతుంది.

యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం.. మధ్య వయసులో సంపాదించింది ఖర్చుపెట్టి పిల్లల్ని విదేశాలకు ….పంపుతాం..‘నా కొడుకు అమెరికాలోనో, ఇంకేదో దేశంలో వున్నాడనో?  కూతురు ఆస్ట్రేలియాలో నో ఇంకేదో దేశంలో ఉన్నదనో ’గర్వంగా చెప్తూ ఫాల్స్  ప్రిస్టేజి ఫీలవుతాం..అంతా బాగానే వుంటుంది…

పిల్లలూ విదేశాల్లో సెటిలైపోయి బాగుంటారు. మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి కూడా రారు..అప్పుడప్పుడు సీజనల్ గావచ్చే'సెల్' ఫోన్ కాల్స్ తోనే సరి పెట్టు కోవాలి.తృప్తి పడాలి. !  కొడుకో,కూతురో,మనవడో గుర్తొచ్చి,వాళ్ళతోమాట్లాడాలని ఫోన్ చేస్తే…'సారీ.! బిజీ.' అంటూ సమాధాన మొస్తుంది.

పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటే 'చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి కన్నతల్లి ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరూ వుండరు.అదృష్టం బాగుంటే.. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ వుండొచ్చు. అనాథాశ్రమంలోఅయితే  వాళ్ళు కూడా ఉండరు.!

అయితే ఇది అందరికీ.. జరుగుతుందని కాదు.

కొందరుంటారు.అదృష్టవంతులు. తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలూ వుంటారు. అలాంటివాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటారు..

బతుకంతా బుద్ధి బలం మీద ఆధారపడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష వుండదేమో? బాగా

బతికిన మహామహులే ముసలితనం రాగానే. దిగజారి హీనమై పోవడం,నా కళ్ళతో నేను చూశాను.

ఇంకా చూస్తూనే వున్నాను.. ఇలాంటి అవస్థను తలుచుకుంటేనే భయమేస్తుంది..

భగవాన్.!

ఇలాంటిదురవస్థ ఎవరికీ రాకూడదు.

ఇందులో నుంచి అందర్నీ తప్పించు తండ్రీ !!

(ఇందులో నేనూ వుండాలి.)

*వృద్ధాప్యం శాపం కాదు..ఓ వరం!!

ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు..

*ఓపిక,సదుపాయముంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపాలో..

*చిన్న పిల్లలుంటే కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పుకోవచ్చు,ఆడుకోవచ్చు.

*ఏం చేసినా…అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి.ఎప్పుడైతే మనం  మానసికంగా ఇలా  ప్రిపేర్ అవుతామో? మన  వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలపాటు వాయిదా వెయ్యొచ్చు..!

సో …ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయిన వారు,

భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయే వారు జీవితాల మీద  ఓ లుక్కేసి వుంచుకోండి.!!


🧘‍♂️ప్రకృతి ద్వారా పరమాత్మ సందేశాలు🧘‍♀️              

🕉️🌞🌎🌙🌟🚩

 1.🌏భూమి:-🌎

     గుండెలో గుచ్చినను భరించి ప్రతిఫలంగా పంటలను, పుష్ప ఫలవృక్షాలను, ప్రసాదిస్తూ, అలానే, మలమూత్రాలను విసర్జించినను, త్రొక్కివేస్తున్నను, ఎంతో నష్టం కష్టం కల్గిస్తున్నను క్షమత్వంతో సహనంగా ఉండడం ద్వారా - క్షమత్వమును, ఓర్పునూ, భూతదయను కల్గివుండాలన్న సందేశం "భూమి"ది. 

 2.🎇ఆకాశం:-🌠

 వచ్చి పోయే మేఘాల వలన మలినపడకుండా, సూర్యచంద్రులు, నక్షత్రాలు, వాయువు తనతో ఉన్నా, వాటితో ఎలాంటి సంగత్వం ఏర్పరుచుకోకుండా, నిర్మలంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా వచ్చే పోయే ఆలోచనలతో అంతఃకరణమును మలినపరుచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని, ఎన్ని బంధాల మద్య ఉన్నా  వాటితో సంగత్వం కల్గియుండక నిర్మలంగా వుండాలన్న సందేశం "ఆకాశము"ది. 

 3.🌞సూర్యుడు:-🌞

 ఒక చిన్న మడుగైనా, పిల్ల కాలువైనా, నదైనా, మహాసముద్రమైనా అన్నింటిలో ఒకేలా ప్రతిబింబిస్తూ, అలానే, నీళ్ళ కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కన్పించడం ద్వారా - మానవుడు సమత్వదృష్టి కల్గియుండాలని, అలానే పరమాత్మ ఒక్కడే అయినా అనేక శరీరములయందు ఆత్మగా గోచరిస్తాడన్న జ్ఞాన సందేశము "సూర్యుడు"ది. 

4.🌝చంద్రుడు:-🌝

 వెలుగు చీకటిలతో వృద్ధిక్షయాలను పొందడం ద్వారా - జీవితంలో సుఖదుఃఖాలు సహజమనే సందేశం "చంద్రుని"ది.

5.💧నీరు:-💧

 ఎటువంటి మలినాలైనను వాటిని శుద్ధిచేసి తాజాదనమును, నిగారింపును తీసుకురావడం ద్వారా - మానవుడు కూడా మనోమాలిన్యాలను తొలగించుకొని శుద్ధత్వము కల్గియుండాలన్న సందేశం "నీటి"ది. 

 6.🔥అగ్ని:-🔥

 స్థూల మాలిన్యాలని హరింపజేసి, ప్రకాశిస్తూ, కారణ రూపాన్ని విడిచిపెట్టడం ద్వారా - మానవుడు కూడా కర్మపాశాలను హరింపజేసుకొని భక్తిజ్ఞానంలతో ప్రకాశించాలన్న సందేశం "అగ్ని"ది.

7. 🌬️గాలి:-🌬️

 అన్నిచోట్ల తిరిగినను, అన్నింటిని స్పృశించినను అన్నింటిని ఎక్కడికక్కడే విడిచిపెట్టేస్తూ, అంతటా ఉన్ననూ ఏదీ అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటూ, అలానే తను ఉన్నచోట వాతావరణమును చల్లగా, ఉల్లాసంగా ఆహ్లాదంగా మార్చుతూ, అందరిలో జీవాన్ని నింపడం ద్వారా - మానవుడు కూడా అహంకార రహితంగా ఏదీ అంటించుకోకుండా తామరాకుపై నీటిబొట్టులా నిస్సంగుడై జీవించాలని, అలానే ఉన్నచోట అందరిని ఆనందంగా వుంచుతూ, ఉల్లాసంగా జీవించాలనే సందేశం "గాలి"ది. 

 8. 🫧నది:-💦

 తాను ఎక్కడ యున్నదో పట్టించుకోక పర్వతమైన, లోయైనా, వంకలైనా, డొంకలైనా, రాళ్ళరప్పల సందులైనా ఏమాత్రం తేడా లేకుండా ప్రవహిస్తూ, తనకి మూలమైన సముద్రాన్ని చేరేంతవరకు ప్రయాణిస్తూనే వుంటూ, పత్రపుష్పాదులు, చెక్కముక్కలు, చెత్తా చెదారములు, చిరు చిరు ప్రాణులు ప్రవాహంలో తనతోపాటు తీసుకువెళ్తూ, తనలో పాలుపోసినా, చెత్తను పడేసిన సముద్రంలో కలిసేంతవరకు ప్రవహించడమనే తన సహజలక్షణమును వదలకపోవడం ద్వారా - మానవ జీవితం కూడా పరవళ్ళుతో ప్రవహించే తనలాంటిదేనని, ఎన్ని అడ్డులు ఉన్నా వాటిని పట్టించుకోక గమ్యం చేరేంతవరకు గమనమును సాగించాలన్న సందేశం "నది"ది. 

9.🌊సముద్రం:-🌊

 అలుపు లేకుండా తీరాన్ని తాకాలని ప్రయత్నించే అలలు ద్వారా, మరియు ఎన్ని నదులు తనలో ప్రవేశించుచున్ననూ పొంగిపోర్లిపోకుండా, అలానే నదులు తనలో చేరక ఎండిపోయినను తాను వట్టిపోకుండ ఉండడం ద్వారా - ఎన్ని సంపదలు తనని చేరుతున్న పొంగిపోక, అలానే ఏ సంపదలు చేరకపోయినా కృంగిపోకుండా హెచ్చుతగ్గుల స్థితి యందు స్థితప్రజ్ఞతో గంభీరుడై, అనుకున్నది సాదించాలనే పట్టుదలతో మానవుడు ఉండాలన్నది "సముద్ర" సందేశం. 

10.🦚పక్షులు:-🦜

 కిలకిలారావాలతో ప్రతిక్షణం ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా పరిపూర్ణంగా జీవించడం ద్వారా మానవుడు కూడా ప్రకృతి లోనే ఉంటూ, ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలన్న సందేశం "పక్షుల"ది.                                                                                  

11. 🌳చెట్టు:-🌳

 తన చెంతకు ఎవరొచ్చినా తరతమ భేదం లేకుండా, హెచ్చుతగ్గుల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదులా, మానవులా అన్న తారతమ్యం లేకుండా నీడను, పండ్లను ఇవ్వడం ద్వారా మానవుడు నిస్వార్ధ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం "చెట్టు"ది.                                                                                   

 12.🪷పువ్వు:-🪷

 మొక్కపై అలరారుతూ అందంగా వికసించి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కల్గిస్తూ, వాడిపోయక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలన్న సందేశాన్నిస్తుంది "పువ్వు". 

 కానీ, మానవుడు వీటిని ఎంతవరకు గుర్తిస్తున్నాడు? అన్నీ కాకపోయినా ఇందులో ఒకటైనా జీవితాంతం ఆచరిస్తే చాలని పెద్దల వాక్కు. 

🕉️🌞🌎🌙🌟🚩

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు ..❤️

క్రోధి అంటే రౌద్రం .. అంటే రుద్రుడి తత్వం .. అంటే క్రోధి శివ తత్వం .. అంటే ఈ సంవత్సరమంతా శివ మయం .. ఎవరు శిక్షింపబడాలో వాళ్ళు రుద్రుడి విలయంలో లీనమౌతారు .. ఎవరు రక్షింపబడాలో వాళ్ళు భోళాశంకరుడి అనుగ్రహానికి పాత్రులౌతారు ..

క్రోధి నామ సంవత్సరం మనందరికీ ఆనంద దాయిని కావాలని కోరుకుందాం ..

శుభం భూయాత్ ❤️

###################################################################################

                                                     విధివ్రాత:  చిన్న కథ

రచన : సుధా విశ్వం

విధి వ్రాతను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యపడదు అనడానికి నిదర్శనం ఈ కథ...

        ఒక దొంగ దొంగతనం చేయడానికి ఒక ఇంటికి కన్నం పెట్టి, లోపలికి ప్రవేశించడానికి చూస్తుంటాడు. ఇంతలో ఆ కన్నం గుండా ఒక నల్లత్రాచు లోపలికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను కాటు వేసి చంపి మెల్లగా దొంగ పక్కనుంచే అతనిని ఏమీ చేయకుండా వెళ్తుంటే ఆశ్చర్య పడిన దొంగ, అలాగే చూస్తుండగానే కొద్దిదూరం వెళ్లిన ఆ నల్లత్రాచు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది .

            అది చూసిన దొంగ తను వచ్చిన విషయం మర్చిపోయి భయంతో, విస్మయంతో అక్కడే నిలబడి చూస్తుంటాడు.   ఇంతలో ఆ వైపుగా వచ్చిన ఒక బాటసారుల బృందం అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడన విశ్రమించడానికి సిద్ధపడి, అందరూ కూర్చుంటారు. అలా కూర్చున్న వారు  బలమైన ఆ చెట్టు కొమ్మలు పడి అందరూ మరణిస్తారు. 

      అటు తర్వాత ఆ చెట్టు ఒక స్త్రీ రూపం ధరించి వెళ్తుండగా చూసిన ఆ దొంగ ఆ స్త్రీ కి దగ్గరగా వెళ్లి ...

        "ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చంపుతున్నావు అందరినీ?" అని అడుగుతాడు.

    ఆవిడ "నేను మృత్యువును. ఎవరు ఏ విధంగా ఏ సమయంలో చంపబడాలని రాసి ఉందో,  ఆ ప్రకారం వాళ్ళ ప్రాణాలు తీయడం నా కర్తవ్యం. అందుకే ఆ ప్రకారంగా రూపం మార్చుకుంటూ ప్రాణాలు హరిస్తున్నాను" అని వివరిస్తుంది.

          అది విన్న దొంగకు తన మరణం ఎలా, ఎప్పుడో తెలుసుకోవాలని కోరిక కలుగుతుంది.

  " అయితే నేను ఎప్పుడు, ఎలా మరణిస్తానో చెప్పమ్మా" అని వేడుకుంటాడు

   "నన్ను ఎవ్వరూ చూడలేరు.ఏదో పుణ్య విశేషం వల్ల నన్ను నువ్వు చూడగలిగావు. కాని అలా చెప్పడం కుదరదు" అన్న మృత్యువుతో

     "ఆ పుణ్య విశేషాన్ని అడ్డుపెట్టి నా మృత్యువు ఎప్పుడు చెప్పమ్మా" అని ప్రాధేయపడతాడు.

         "సరే! ఇంతగా ప్రాధేయ పడుతున్నావు కనుక చెబుతాను.  నీకు ఇంకా సమయం ఉంది. ఆ లోపు మంచి పనులు చేసి బ్రతుకుతూ నీ

 జన్మ సార్ధకం చేసుకో. ఈ రహస్యం ఎవరికీ చెప్పవద్దు" అని హితవు పలికి,  

           సరిగ్గా ఇదే రోజు మరుసటి సంవత్సరం , ఫలానా సమయానికి ఏనుగు చేత తొక్కబడి మరణిస్తావు అని చెబుతుంది. 

         అది విన్న దొంగ ఆవిడకు ధన్యవాదాలు తెలుపుకుని తన ప్రాంతానికి బయలుదేరుతాడు.

                అప్పట్నుంచి ఆ దొంగ అన్ని దొంగతనాలు మానేసి మంచి పనులు చేస్తూ, అందరికి సాయపడుతూ జీవిస్తుంటాడు.  

        నేను దొంగగా ఉంటే రాజ భటులకు దొరికి రాజదండనకు గురి కావొచ్చు కదా!  ఇప్పుడు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను  మృత్యువు నుండి తప్పించుకోగలిగాను అనుకుంటాడు.

 కానీ...

       అనుకోని విధంగా ఇంకెవరో చేసిన దొంగతనానికి ఈ దొంగ పాత నేరస్థుడు అయిన కారణంగా ఇతన్ని అనుమానించి,  తీస్కెళ్ళి రాజు ముందు  నిలబెడతారు.

  " నేను ఏ దొంగతనం చేయలేదు. నేను మంచిగా మారాను మహారాజా! మంచి జీవితం గడుపుతున్నాను" అంటాడు. కానీ..

        ఆ రాజుగారు  వినకుండా,

   "ఇంతకుముందు చేసేవాడివే కదా! ఇప్పుడు మారావని నమ్మకం లేదు" అని ఇతన్ని ఏనుగులతో తొక్కించి చంపండి అని ఆజ్ఞాపిస్తాడు. 

     మృత్యువు చెప్పిన గడువు దగ్గరికి వచ్చింది. ఇక లాభం లేదని రాజుగారు విధించిన శిక్ష అమలు చేయడానికి తీసుకెళ్తున్న ఆ భటులతో ఇలా వేడుకుంటాడు....

        " నన్ను ఇంకేరకంగా అయినా చంపండి. కానీ ఏనుగు ద్వారా మాత్రం వద్దు.  ఇది నా చివరి కోరిక. చివరి కోరిక తీర్చడం మీ ధర్మం కదా" అని అంటాడు.

      "అలా రాజాజ్ఞ ధిక్కరించలేము. రాజుగారు ఏ శిక్ష విధిస్తే అది మాత్రమే అమలు చేయాలి మేము" అంటారు వాళ్ళు.  

         దొంగ ఎంతో బ్రతిమిలాడిన తరువాత...

                   "కానీ చివరి కోరికగా అడుగుతున్నావు. కనుక ఒక పని చేస్తాం.కనీసం మొదటగా ఒక ఏనుగు బొమ్మ చేత నిన్ను తొక్కించి, ఆ తర్వాత నీ ఇష్టమైనట్టు చంపుతాం అప్పుడు మాకు రాజాజ్ఞ ధిక్కరించినట్టు అవ్వదు, నీ చివరి కోరికా తీర్చినట్టు అవుతుంది. ఏమంటావ్" అంటారు. 

         సరే బొమ్మే కదా అనుకుంటాడు. అందుకని ఒప్పుకుంటాడు దొంగ.

       కానీ ఆ బొమ్మను దొంగపై పెట్టగానే అదే నిజమైన ఏనుగుగా మారి తొక్కి, ఆ దొంగను చంపేస్తుంది. అలా  విధి నిర్ణయించినట్లుగా, నియమిత సమయానికి దొంగ మరణిస్తాడు

         అందుకే ప్రతి చిన్న విషయానికి భయపడవద్దు. జరిగేది ఎలా అయినా జరుగుతుంది అంటారు పెద్దలు.  అలాగని మొండిగా ఇష్టంవచ్చినట్టుగా చేయకూడదు.

      మృత్యువు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది. కనుకనే ఉన్న జీవితాన్ని మంచి పనులతో, పరోపకారబుద్ధి తో, ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకుండా గడుపుతూ జన్మ ను సార్ధక్యము చేసుకోవాలి...

చిన్నప్పుడు మా అమ్మ ద్వారా విన్న కథ

సుధావిశ్వం

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Very nice article by Late  Khushwant Singh. Preserve this . 😊

How To Live & Die

 I’ve often thought about what it is that makes people happy—what one has to do in order to achieve happiness. 

 1. First and foremost is good health. If you do not enjoy good health, you can never be happy. Any ailment, however trivial, will deduct something from your happiness. 

 2. Second, a healthy bank balance. It need not run into crores, but it should be enough to provide for comforts, and there should be something to spare for recreation like eating out, going to the movies, travel and holidays in the hills or by the sea. Shortage of money can be demoralising. Living on credit or borrowing is demeaning and lowers one in one’s own eyes. 

 3. Third, your own home. Rented places can never give you the comfort or security of a home that is yours for keeps. If it has garden space, all the better. Plant your own trees and flowers, see them grow and blossom, and cultivate a sense of kinship with them. 

 4. Fourth, an understanding companion, be it your spouse or a best friend. If you have too many misunderstandings, it robs you of your peace of mind. It is better to accept the differences than to be quarrelling all the time. 

 5. Fifth, stop envying those who have done better than you in life, risen higher, made more money, or earned more fame. Envy can be corroding; avoid comparing yourself with others. 

 6. Sixth, do not allow people to descend on you for gossip. By the time you get rid of them, you will feel exhausted and poisoned by their gossip-mongering. 

 7. Seventh, cultivate a hobby or two that will fulfill you like gardening, reading, writing, painting, playing or listening to music. Going to clubs or parties to get free drinks, or to meet celebrities, is a criminal waste of time. It’s important to concentrate on something that keeps you occupied meaningfully. 

 8. Eighth, every morning and evening devote 20 minutes to meditation or introspection. In the mornings, 10 minutes should be spent in keeping the mind absolutely still, and for listing the things you have to do that day. In the evenings, five minutes should be set aside to keep the mind still and 10 to go over the tasks you had intended to do. 

 9. Ninth, don’t lose your temper. Try not to be short-tempered, or vengeful. Even when a friend has been rude, just move on. 

 10. Above all, when the time comes to go, one should go like a Person without any regret or grievance against anyone. 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

One of the best messages I have read in recent times :) SUPERB!

Time Will Come !

New York is 3 hrs ahead of California but it does not mean that California is slow, or that New York is fast. Both are  working based on their own "Time Zone."

Some one is still single. Someone got married and 'waited' 10 yrs before having a child, there is another who had a baby within a year of marriage.

Someone graduated at the age of 22, yet waited 5 years before securing a good job; and there is another who graduated at 27 and secured employment immediately !

Someone became CEO at 25 and died at 50 while another became a CEO at 50 and lived to 90 years. 

Everyone works based on their 'Time Zone',

People can have things worked out only according to their pace.

Work in your “time zone”.

Your Colleagues, friends, younger ones might "seem" to go ahead of you.

May be some might "seem" behind you.

Don't envy them or mock them, it's their 'Time Zone.' 

You are in yours!

Hold on, be strong, and stay true to yourself. 

All things shall work together for your good. 

You’re not late … You are not early ... you’re very much On time!

😊👍stay blessed.

You Are In Your Time Zone....🌐

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Justice G.D. Khosla was the judge who presided over the Nathuram Godse case and sentenced Nathuram Godse to death. After executing Godse, the judge wrote on pages 305-06 of his book "The Murder of the Mahatma and Other Cases from a Judge's Diary": "In court, Godse presented his case in a lengthy five-hour statement, which was 90 pages long. After he finished speaking, the listeners were stunned and disturbed. There was a deep silence when he stopped talking, and there were tears in the eyes of the women, and the men were searching for handkerchiefs while coughing. 

I have no doubt that if a jury of the people present in the courtroom that day had been formed and asked to deliver a verdict on Godse, they would have declared him 'innocent' by a significant majority. After hearing Godse's statement, I did not want to sentence him to death, but I was compelled by the pressure of the government and administration. I know that by sentencing Godse to death, I have committed a 'sinful act' for which severe punishment awaits me in Yama's abode. I sentenced an 'innocent' and 'great patriot' to death, and for that, God will never forgive me."

************************************************************************


🕉 మన గుడి : నెం 518

⚜ అస్సాం : గౌహతి

⚜ శ్రీ #కామాఖ్యదేవి ఆలయం

💠 హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో  కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. 

మన దేశంలో అత్యంత శక్తిమంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. 

🔅 పురాణ గాథ 🔅

💠 దక్షప్రజాపతి పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు, వచ్చిన కూతురిని అవమానిస్తాడు. సహించలేని ఆమె యజ్ఞ గుండంలో దూకి అగ్నికి ఆహుతై పోతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. విరాగిలా మారి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీమహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. అమ్మవారి యోని భాగం గౌహతీ వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. 

ఈ ప్రాంతంలోనే కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. 

💠 కామాఖ్య దేవాలయం శివుడు, సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని , శివుడు ఇక్కడ అమ్మవారితో కామకేళిలో తేలియాడుతూ ఉంటాడని అంటారు. అందుకే ఆ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు.

అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. 

గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. 

సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది.

💠 ఏటా వేసవికాలంలో 3 రోజులపాటు,

అమ్మవారి ఋతు స్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు.

 ఆ సమయంలో అక్కడకు వెళ్లడానికి చాలా మంది భయపడుతారు. 4 రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ నివసించేవారు దీనిని 'అంబుబాషి’ సమయం అని అంటారు. 

5వ రోజు దేవాలయం తెరుస్తారు. 

అంబుబాషి రోజులలో  గౌహతిలో అమ్మవారి దేవాలయములతో పాటు మిగతా దేవాలయములు అన్ని మూసే ఉంచుతారు.

💠 అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. 

⚜ స్థల పురాణం ⚜

💠 పూర్వం కూచ్‌ బెహర్‌ రాజా విశ్వసింహ 

నీలాచలంపైకి వస్తాడు. 

దగ్గరలో కనిపించే మట్టిదిబ్బ ఏమిటని అక్కడున్న ఓ అవ్వను ప్రశ్నించగా అందులోని దేవత శక్తిమంతురాలని ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. 

తన రాజ్యంలో కరవు శాంతిస్తే గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అనుకున్నట్లుగానే రాజ్యం సస్యశ్యామలమవుతుంది. అప్పుడు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్విస్తుండగా కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. 

ఆ తల్లిని అక్కడే కొలువుదీర్చి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు.

💠 ఈ ఆలయాన్ని కాలపహార్‌ అనే అజ్ఞాత వ్యక్తి నాశనం చేయటంతో చిలయ్‌రాయ్‌ పునర్నిర్మించారు. 

తదనంతర కాలంలో చేసిన చిన్న తప్పిదానికి ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. ఆలయ ప్రవేశాన్ని కోల్పోయిన ఆ వంశస్థులు ఇప్పటికీ నీలాచలం దరిదాపుల్లోకి కూడా ప్రవేశించరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

💠 మొదటి నుంచి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలులు సర్వసాధారణం. మరెక్కడా లేనివిధంగా ఇక్కడ మహిషాలను సైతం బలిస్తారు.

ఇక్కడ అమ్మవారికి బలి ఇవ్వడానికి నల్లటి మనిషిని, కుక్కను, పిల్లిని, పందిని, గాడిదను, కోతి, మేక, పావురం మొదలగునవన్నీ నలుపు రంగులో ఉండాలి. అమ్మవారికి అన్నీ నల్లటి జంతువులనే బలి ఇవ్వాలి. ఇదే ఇక్కడ ఆచారం. ఆడ  జంతువులను వధించరాదని నియమము. 

💠 సంధ్యావేళ దాటిన తరవాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడా ఉంది. అందుకే సాయంత్రం దాటితే ఆలయాన్ని మూసేస్తారు.

💠 అమ్మవారి ఆలయ ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తిమంతమైందని భక్తుల విశ్వాసం. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెబుతారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపురంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని పిలుస్తారు. అమ్మ వారి యోని స్రావిత పవిత్ర జలలాతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మ హత్యా పాతకమైనా నివారణ మవుతుందని విశ్వాసం.

💠  ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాల భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినియై దర్శనమిస్తుంది. 

పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా మారుతుంది.

 ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తుంటారు.

💠 గౌహతి రైల్వేస్టేషన్‌ నుంచి 6 కి.మీ దూరం

*****************************************************************

What are five things senior citizens should not do at the age of 65 and over ?

Never sit idle at home . Many people prefer walking rather than doing exercises because going gym is wastage of money for them . 
Doing work at home and doing exercise in gym is altogether two different things . Outside You mingle with people and refresh yourself . 
Even if you can’t go to gym you can do some sort of yoga or stretching exercises in nearby park with your group of friends .
Never ever think that why to buy new clothes or shoes or bags for me ? I am getting old ! A big NO . Try all latest outfits with confidence . It boosts your confidence.
Don’t stop eating proteins of any kind if you are consuming . It keeps your muscles tight and prevents from sagging . People say old ones can’t digest . It’s not so . If you consume regularly it will go with you at any age . Don’t forget to take multivitamins intermittently .

Don’t forget to grow a kitchen garden . Working in the garden keeps your body flexible and mind fresh . Close to the nature is close to the God what I have heard . Don’t know but I talk to my plants while taking care or watering them .

Never give unnecessary advice to youngsters . Do this or do that . Just listen to them and nod your head in affirmation . We can’t vibe with younger ones as there is a generation gap I feel . Besides that present generation is quite smart . Let’s mind our own business and remain fit and healthy .😃😅

##########################################################################

శివుని రావణునికిచ్చిన ఆత్మలింగాన్ని గోకర్ణంలో ప్రతిష్ఠించిన మహాగణపతి🌼🌿

🌿🌼కర్ణాటక రాస్త్రములోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రము కార్వార్ పట్టణ బీచ్ ఒడ్డున  గోకర్ణనందు కల మహా బలేశ్వర ఆలయం నాలుగవ శతాబ్దమునకు చెందినది. యాత్రికులు ఈ ఆలయమునందు దేముని అర్చించుటకు పవిత్రముగా వస్తారు. ఉత్తర భారత దేశములోగంగా నది ఒడ్డున ఉన్న వారణాశినందు కల విశ్వనాధుని ఆలయముతో సమానముగా ఈ ఆలయము పవిత్రమైనదిగా భావిస్తారు .అందువలన గోకర్ణ నందలి మహాబలేశ్వర్ ఆలయమునకు  దక్షణ కాశీ అనిపేరు. నలు చదరపు శాలిగ్రామ పీఠముపై మధ్యలో ఆరు అడుగుల ప్రణవలింగము అనబడు ఆత్మలింగము కలదు. భక్తులు నలభై సంవత్సరములకు ఒక పర్యాయము వచ్చు కుంభాభిషేకము రోజున తప్ప  లింగము పై భాగమే కానీ లింగము పూర్తిగా దర్శించుకొనుటకు వీలుకాడు 1500 సంవత్సరముల క్రిందటి పురాతనమైన రాతి శివుని విగ్రహము మిక్కిలి మనోహరముగా ఉంటుంది. అరేబియా సముద్రపు కార్వార్బీచ్ నకు పశ్చిమాభి ముఖముగా ఉన్నఈ పవిత్రమైన మహాబలేశ్వర్ ఆలయం దర్శించుటకు ముందు ఆచారప్రకారము ఈ బీచ్ నందు స్నానముచేసి బీచ్నకు దగ్గరలో కల మహాగణపతి ఆలయము సందర్శించ వలయును. కర్ణాటక నందు కల ఏడు ముక్తి స్థలములు ఉడుపి, సుబ్రహ్మణ్య (కుక్కి), కొల్లూరు, కుంభాసి, శంకరనారాయణ మరియు కోడేశ్వరలతో పాటు ఏడవది. భక్తులు మరణించిన తమ బంధువుల కర్మలను మహాబలేశ్వర్ ఆలయములో చేయుట సర్వ సాధారణము. జగద్గురు ఆదిశంకరాచార్య స్థాపించిన రామచంద్రపురమఠం వారి ఆధ్వర్యములో ఈ ఆలయము నిర్వహించబడుచున్నది. సుమారు 1700 సంవత్సరముల క్రిందట ఈ ఆలయము నిర్మించబడి పూజాధికములు నిర్వహించుటకు కాంచీపురము నుండి బ్రాహ్మణ కుటుంభములు తీసుకురాబడినవి. మహాకవి కాళిదాసు రఘువంశమునందు గోకర్ణ మహాబలేశ్వర్ గురించి వ్రాసినాడు. రావణుడు ఆత్మలింగ మును భూమినుండి పెకలించుటకు ప్రయత్నించి విఫలుడైనాడు. అత్యంత అరుదైన ఆత్మలింగం దర్శనం. శివుడు రావణునికి ఇచ్చిన ఆత్మ లింగం గోకర్ణ  క్షేత్రంలో వినాయకుని ద్వార ప్రతిష్టితమై మహాబలేశ్వర లింగం పేరుతో పూజలందుకుంటోంది. లింగం పూర్తిగా  దర్శనం ఇవ్వదు, కేవలం పై భాగం మాత్రమే మనం దర్శించగలం, స్పర్శించగలం మహాబలేశ్వర్ ఆలయము ఉదయం 6 నుండి 12 వరకు సాయంత్రం 5 నుండి 8 వరకు తెరచి ఉంటుంది. మాహాశివరాత్రి ముఖ్యమైన పండుగ.  మహాగణపతి ఆలయం: గణేశునికి చెందిన ఈ ఆలయం రావణుడు ఆత్మలింగము ను ఆతని లంకా రాజ్యమునకు  తీసుకొని పోవు ఉద్దేశమును ఉపసంహరించుటలో పోషించిన పాత్రకు గుర్తుగా నిలచి ఉంది. రెండు చేతులు జోడించి ఉన్న స్థితిలో అయిదు అడుగుల గణేశుని విగ్రహము ఈ ఆలయమందు కలదు.🌼🌿

ఓం గం గణపతయే నమః

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు

 శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది.  మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.

ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.

ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.

అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు.

ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.

దీని తర్వాత  కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.

“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.

కలియుగం ప్రవేశించగానే మనుష్యులయందు రెండు లక్షణములు బయలు దేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.

ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.

కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.

కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.

అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు. తద్వారా బ్రహ్మ యోగం అనబడే క్రియా యోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.

ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.

మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు.

ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.

ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.

కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది.

ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.

కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.

కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.

కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో!

కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి. శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ నేను వున్నాను. వుంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా! ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, యింద్రియ నిగ్రహము, చేయుట, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.

ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం...

ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.

******************************************************************************

నిద్ర పోయే ముందు చెప్పుకునే శ్లోకము

రామ స్కందం 
హనూమంతం వైనతేయం వృకోదరం |
శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్నం- తస్య నశ్యతి ‖

అపరాధ క్షమాపణ స్తోత్రం

అపరాధ సహస్రాణి, క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ‖

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసంవాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ‖

***********************************************************************************

THE TOXINS OF THE HOUSE ARE:
1. Objects You No Longer Use.
2. Clothes You Don't Like Or Haven't Used In A While. Damaged underwear.
3. Broken Things.
4. Old cards and notes.
5. Plants that are dead or sick.
6. Receipts and Old Magazines.
9. Shoes Broke.
7. Stuff of all kinds calling the past.
8. If you have children, toys that are not used, that do not work or broken.
WITH CLEANING THEM OUT:
1. Health gets better.
2. Creativity grows.
3. Relationships get better.
4. There is greater reasoning capacity.
5? Improved mood.
QUESTIONS THAT MIGHT HELP CLEANSING:
- Why am I saving that?
- Is it about me today?
- How will I feel if I release that?
Separate and classify:
1. To donate.
2. To throw.
3. To sell.
INSIDE CLEANING REFLECTED OUTSIDE.
1. Avoid extreme noises.
2. Less strong lights.
3. Less saturated colors.
4. Less chemical odors.
5. Less sad memories.
6. Finish unfinished projects.
7. Cultivate positive energy in your home.
Do a general cleaning and use boxes for organization. Start with drawers and cabinets and conclude each piece, do everything at your pace...
a) Trash.
b) Arrangements.
c) Recycling.
d) In doubt.
e) Gifts.
(f) Donation.
g) Sell.
As you CLEANSE, watch what changes in you.
As we clean our physical house, we also place order to our mind and heart.
Practice detachment with material things that just fill your space and you'll see how you'll slowly be able to do the same with more momentous situations.
Blessed be for you always

*************************************************************************

"ఒక భర్త ఆవేదన"

భార్య చనిపోయి ఇప్పటికీ నాలుగు రోజులు గడిచి పోయాయి.. 
తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు.. 

చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాము.
తను నాతోపాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.

ప్రతి విషయానికి 'ఏమండీ అనే పిలుపుకు నేను దూరమయ్యాను' 

నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు.. 

ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు.

ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది, నిజానికి తను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కాదు.. వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే స్వార్థం నాలో ఉండేది.. 

సెలవు దినాలలో నేను మరియు పిల్లలు టివి చూస్తూ ఆనందిస్తుంటే, తను మాత్రం వంటింట్లో వంట చేయడంలో బిజీగా ఉండేది.. 
  
ఎప్పుడైనా మాతో పాటు టివి చూడటానికి కూర్చుంటే 'అమ్మా... నీళ్లు, 'అమ్మా .. తినడానికి ఏమైనా తీసుకురా, 'కొంచెం కాఫీ పెట్టవోయ్ అంటూ .. తనని మళ్లీ వంటింట్లోకి పంపించే వాళ్ళం . 

నేను అడగకుండానే అర్థం చేసుకుని నా అన్ని పనులు చేసి పెట్టేది.. 
ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్లకు మరియు కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని మరవలేకపోతున్నాను.. 

తన ఇష్టాలను సహితం నేను గుర్తించలేకపోయాను, తను కూడా ఎప్పుడూ అడిగింది లేదు .. ఆఫీసు నుండి లేటు వచ్చినపుడు 'ఎందుకు లేటయ్యింది' అనే తన ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని .. 

చివరకు నాకు సంబంధించిన బిపి మాత్రలు, షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకొండని మరీ మరీ గుర్తుచేసేది.. ఇప్పుడు అవన్నీ గుర్తుచేయడానికి తనులేదు.. 😔

రాత్రి పని అంతా ముగించుకుని నా పక్కన పడుకున్నప్పుడు,
ఏమండీ ఎదలో నొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉంది, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల అని చెప్పి అటు తిరిగి పడుకునే వాడిని.. 

చివరికీ ఆ ఎద నొప్పి హార్ట్_ఎటాక్ రూపంలో వచ్చి తనను తీసుకు వెళ్లేవరకు నేను గుర్తించలేకపోయాను.. 

పిల్లలు ఏది పట్టనట్లు తమ తమ మొబైల్స్ తో బిజీగా గడుపుతున్నారు.. 
తను ఉన్నన్నీ రోజులు అన్ని సులభంగా అయ్యే పనులు, ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి.. 

లైట్ ఆఫ్ చేసి పడుకుందామనే లోపు గోడ మీద వేలాడుతున్న తన భావ చిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చాయి 😥
 
తనను తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యము చేయకుంటే నేను, నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళం అని తలచుకుంటూ భారంగా కళ్ళు మూసాను నిద్ర లోకి .. హుమ్మ్ 🍁

**********************************************************************************

Comments

Popular posts from this blog

A B V High School Friends Stories -1

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju

Bhagavad-Gita (Purushottama Yoga 15.1 shloka